హైదరాబాద్: స్వరాష్ట్ర సాధన కోసం ఉవ్వెత్తున ఎగసిన తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో కీలక ఘట్టం మిలియన్ మార్చ్ అని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ (Harish Rao) అన్నారు. ప్రపంచ ప్రజా ఉద్యమాల సరసన తెలంగాణ ఉద్యమాన్ని నిలిపిన ప్రజా విప్లవమని చెప్పారు. నిర్బంధాలు.. అరెస్టులు.. దిగ్బంధాలను ఎదుర్కొంటూ జల మార్గం గుండా పడవలో వచ్చి మిలియన్ మార్చ్ లో పాల్గొన్న సందర్భం నేటికి 13 ఏండ్లయినా ఇంకా కళ్ళముందు కదలాడుతూనే ఉందంటూ నాటి ఘటనను గుర్తుచేసుకున్నారు. స్వరాష్ట్ర సాధన కోసం ఆ నాడు తెలంగాణ ప్రజలు చూపిన తెగువకు, పోరాటానికి, ఉద్యమ స్ఫూర్తికి వందనమని సామాజిక మాద్యమం ఎక్స్ వేదిగా పంచుకున్నారు.
స్వరాష్ట్ర సాధన కోసం ఉవ్వెత్తున ఎగసిన తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో మిలియన్ మార్చ్ కీలక ఘట్టం. ప్రపంచ ప్రజా ఉద్యమాల సరసన తెలంగాణ ఉద్యమాన్ని నిలిపిన ప్రజా విప్లవం.
నిర్బందాలు..అరెస్ట్ లు..దిగ్బందాలను ఎదుర్కొంటూ జల మార్గం గుండా పడవలో వచ్చి మిలియన్ మార్చ్ లో పాల్గొన్న సందర్భం నేటికీ… pic.twitter.com/7yeeJ70xfd
— Harish Rao Thanneeru (@BRSHarish) March 10, 2024