హైదరాబాద్: రేషన్ కార్డులకు మీసేవా దరఖాస్తుల పేరుతో కాంగ్రెస్ పార్టీ మరోసారి దగా చేస్తున్నదంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు (Harish Rao) ఆగ్రహం వ్యక్తం చేశారు. దరఖాస్తుల పేరిరు ప్రజలను ఇంకెన్ని సార్లు మోసం చేస్తారని సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. ప్రజా పాలనలో దరఖాస్తులు చేసుకున్నరు. కుల గణనలో వివరాలు తీసుకున్నరు. గ్రామ సభల పేరుతో డ్రామా చేశారు. ఇప్పుడు మల్లా మీసేవలో దరఖాస్తులు అంటున్నరు. పథకాల పేరిట ఇన్నాళ్లు మీరు చేసిన హడావుడి స్థానిక సంస్థల ఎన్నికల కోసం చేసిన గారడీ నేనా అంటూ మండిపడ్డారు.
ప్రజా పాలన, గ్రామ సభల దరఖాస్తులకు విలువ లేదా అని నిలదీశారు. బీఆర్ఎస్ పాలనలో దరఖాస్తు లేకుండా, దస్త్రం లేకుండా తెలంగాణలో పథకాల అమలు జరిగింది. కాంగ్రెస్ పాలనలో దరఖాస్తులు అంటూ మోసం చేస్తున్నారు. జనాల్లో గందరగోళం సృష్టిస్తున్నారు. పేదలకు రేషన్ కార్డులు, ఇతర సంక్షేమ పథకాలు అందించాలనే ఆలోచన కంటే, కోతలు పెట్టి ఎలా అందకుండా చేయలన్న దానిపైనే మీ ప్రభుత్వ దృష్టి ఉందంటూ రేవంత్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దరఖాస్తుల పేరిట దగా చేయడం తప్ప, 14 నెలల పాలనలో మీరు చేసిందేముందని ధ్వజమెత్తారు. దరఖాస్తుల పేరిట కాలం వెళ్లదీయడం మానేసి, పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందజేయాలని సూచించారు. ఇచ్చిన మాట ప్రకారం రేషన్ కార్డులు, ఇండ్లు, రైతు భరోసా, ఆత్మీయ భరోసా పథకాలను అమలు చేసి, నిరుపేదలకు, రైతులకు బాసటగా నిలంటూ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.
దరఖాస్తుల పేరిట ఇంకెన్ని సార్లు ప్రజలను మోసం చేస్తారు రేవంత్ రెడ్డి?
ప్రజా పాలనలో దరఖాస్తులు చేసుకున్నరు.
కుల గణనలో వివరాలు తీసుకున్నరు.
గ్రామ సభల పేరిట డ్రామా చేశారు.
ఇప్పుడు మల్లా మీసేవలో దరఖాస్తులు అంటున్నరు.పథకాల పేరిట ఇన్నాళ్లు మీరు చేసిన హడావుడి స్థానిక సంస్థల ఎన్నికల… pic.twitter.com/PsZin1po6M
— Harish Rao Thanneeru (@BRSHarish) February 8, 2025