హైదరాబాద్, ఏప్రిల్ 19 (నమస్తే తెలంగాణ): ఈ ఏడాది కొత్తగా మరో తొమ్మిది మెడికల్ కాలేజీలను ప్రారంభించనున్న నేపథ్యంలో ఇప్పటికే ఆరు కాలేజీలకు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుంచి అనుమతులు వచ్చాయని హరీశ్రావు ట్వీట్ చేశారు.
జనగామ, కుమ్రంభీం ఆసిఫాబాద్, కామారెడ్డి, ఖమ్మం, వికారాబాద్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో మెడికల్ కాలేజీల ఏర్పాటుకు ఇప్పటికే అనుమతులు వచ్చాయని పేర్కొన్నారు. నిర్మల్, కరీంనగర్, సిరిసిల్ల మెడికల్ కాలేజీల అనుమతులు తుది దశలో ఉన్నాయని తెలిపారు. ఇందుకు కృషి చేసిన అధికారులను మంత్రి అభినందించారు.