హైదరాబాద్ : ఎక్కడా ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని అధికారులను మంత్రి హరీశ్రావు ఆదేశించారు. సిద్ధిపేట కలెక్టరేట్లో బుధవారం సాయంత్రం ధాన్యం కొనుగోళ్లపై హరీశ్రావు సమీక్ష నిర్వహించారు. ఈ యాసంగిలో జిల్లాలో 2.62లక్షల ఎకరాల్లో ధాన్యం కొనుగోళ్లు చేసినట్లు తెలిపారు.
ఈ వానాకాలం జూలై నుంచి జిల్లాలో 25 వేల ఎకరాలలో ఆయిల్పామ్ సాగు చేపట్టడమే లక్ష్యంగా పని చేయాలని సూచించారు. వెయ్యి ఎకరాల్లో పట్టు పరిశ్రమ చేపట్టాలని, అలాగే పత్తి పంటకు మంచి డిమాండ్ ఉన్న దృష్ట్యా వానాకాలం సాగు విస్తీర్ణం పెంచాలని అధికారులకు ఆదేశించారు. ఈ యాసంగి వరి దిగుబడి వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. వానాకాలం 25 శాతం వెద సాగు విస్తీర్ణం పెంచాలని వ్యవసాయ శాఖ, స్థానిక ప్రజాప్రతినిధులకు మంత్రి హరీశ్రావు దిశా నిర్దేశం చేశారు.