హైదరాబాద్ : భారత రాజ్యాంగ నిర్మాత డా.బీఆర్ అంబేద్కర్(Ambedkar) బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు(Harish Rao) అన్నారు. అంబేద్కర్ జయంతిని పురస్కరిం చుకొని ఆదివారం సంగారెడ్డిలో(Sangareddy) అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు(Tribute) అర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అంటరానితనం, వివక్షలపై అలుపెరుగని పోరాటం చేసిన గొప్ప యోధుడు అంబేద్కర్ అన్నారు.
అంబేద్కర్ను యువత ఆ దర్శంగ తీసుకొని మార్పు తీసుకురావాలని సూచించారు. దేశాభివృద్ధిలో అంబేద్కర్ పాత్ర విస్మరించలేనిదన్నారు. దేశానికి ఆయన చేసిన సేవలు వెలకట్టలేనివని కొనియాడారు. ఆయన చూపిన మార్గంలో మనందరం పయనించడమే ఆ మహనీయుడికి మనమిచ్చే అసలైన నివాళని పేర్కొన్నారు.