హైదరాబాద్: హామీలు తప్ప.. ఆచరణ మాత్రం కాంగ్రెస్కు సాధ్యం కావడం లేదని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) విమర్శించారు. అధికారంలోకి రాగానే ప్రతి నెల ఒకటో తేదీన జీతాలు చెల్లిస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందని చెప్పారు. అయితే 22 రోజులు గడుస్తున్నా జీతం రాకపోవడంతో అంగన్వాడీలు అనేక తిప్పలు పడుతున్నారని తెలిపారు. నెలంతా పని చేసి జీతం కోసం ఎదురు చూడాల్సిన దుస్థితి వచ్చిందన్నారు. ప్రభుత్వం తక్షణం స్పందించి, అంగన్ వాడీ టీచర్లు, ఆయాలు, సమగ్ర శిక్ష, కేజీబీవీ సిబ్బందికి జీతాలు చెల్లించాలని సామాజిక మాధ్యమం ఎక్స్ (ట్విట్టర్) వేదికగా డిమాండ్ చేశారు.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ప్రతి నెల ఒకటవ తేదీన జీతాలు చెల్లిస్తామని ప్రచారం చేసుకున్నారు. కానీ ఆచరణ మాత్రం సాధ్యం కావడం లేదు. 22 రోజులు గడుస్తున్నా అంగన్ వాడీలకు జీతం రాక అనేక తిప్పలు పడుతున్నారు. నెలంతా పని చేసి జీతం కోసం ఎదురు చూడాల్సిన దుస్థితి వచ్చింది.…
— Harish Rao Thanneeru (@BRSHarish) February 22, 2024