తెలంగాణకు రావాల్సిన గ్రాంట్లు, బాకీలు – రూ. 27,350 కోట్లు
కేంద్రప్రభుత్వం వెంటనే విడుదల చేయాలి
నీతి ఆయోగ్, ఆర్థిక సంఘం
సిఫారసులను అమలు చేయండి
కేంద్ర ఆర్థికమంత్రికి హరీశ్రావు లేఖ
హైదరాబాద్, ఫిబ్రవరి 19, : తెలంగాణకు రావాల్సిన గ్రాంట్లు, బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్రావు కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన శనివారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు మరోసారి లేఖ రాశారు. గతంలో చేసిన అభ్యర్థనలను మరోసారి గుర్తుచేశారు. కేంద్రం నుంచి గ్రాంట్లు, బకాయిల రూపంలో రాష్ర్టానికి సుమారు రూ.27,350 కోట్ల వరకు రావాల్సి ఉన్నది. మంత్రి లేఖలోని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి..