హైదరాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో హత్యా రాజకీయాలు, బెదిరింపులు నిత్యకృత్యం అయ్యాయి. ప్రశ్నించే గొంతుకలైన బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలను కాంగ్రెస్ పార్టీ బెదిరింపులతో నిలువరిం చలేదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు(Harish Rao) అన్నారు. మెదక్(Medak) జిల్లా రామాయంపేట పట్టణ బీఆర్ఎస్ అధ్యక్షుడు, కౌన్సిలర్ గజవాడ నాగరాజుపై(BRS Councillor Nagaraju) కాంగ్రెస్ పార్టీకి చెందిన పోచమ్మల గణేష్ అనే వ్యక్తి పెట్రోల్ పోసి దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.
దాడి కారకులైన వ్యక్తిని గుర్తించి వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యంలో వ్యక్తిగత కక్షలకు తావులేదన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇలాంటి దాడులకు పాల్పడటం ఆటవిక చర్యగా ఆక్షేపించారు. కాగా, బీఆర్ఎస్ నాయకులు నాగరాజుపై దాడి జరిగిన వెంటనే స్పందించి ప్రభుత్వ దవాఖానకు తరలించారు. అక్కడ నుంచి మెరుగైన వైద్యం కోసం కామారెడ్డిలోని ప్రైవేట్ హాస్పిటల్కు నాగరాజును తరలించారు.