హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డికి సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు (Harish Rao) జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కనీసం మీరు పుట్టిన ఈ ఒక్క రోజైనా నిర్బంధాలు, అక్రమ అరెస్టులు లేకుండా పాలన కొనసాగించాలని కోరుకుంటున్నానని చెప్పారు. సీఎం ముఖ్యమంత్రి మూసీ పాదయాత్ర సందర్భంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అక్రమ అరెస్టులు, నిర్బంధాలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. మాజీ ఎమ్మెల్యేలు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, చిరుమర్తి లింగయ్య, భూపాల్ రెడ్డి సహా ఇతర బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను హౌస్ అరెస్టులు చేసినంత మాత్రాన సీఎం పాదయాత్రకు ప్రజల మద్దతు లభించదని విమర్శించారు.
ముఖ్యమంత్రి మూసీ పాదయాత్ర హంతకుడే సంతాప సభ పెట్టినట్లు ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మూసీ మురికి కూపంగా మారడానికి 50 ఏండ్ల కాంగ్రెస్ పాలన కారణం కదా అని ప్రశ్నించారు. పాదయాత్ర కాదు, పాప పరిహారయాత్ర చేసినా మీ కాంగ్రెస్ పార్టీ పాపం పోదన్నారు. . పేదల గూడు కూల్చింది ఒక దగ్గర, పాదయాత్ర చేసేది మరొక దగ్గరని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్లో ఇండ్లు కూల్చి, నల్లగొండలో పాదయాత్ర చేస్తారా అని నిలదీశారు. దమ్ముంటే.. హైదరాబాద్ నుంచి పాద యాత్ర మొదలు పెట్టాలని సవాల్ విసిరారు. మీ పాదయాత్రకు ప్రజల మద్దతే ఉండి ఉంటే, ఈ నిర్బంధాలు, అక్రమ అరెస్టులు ఎందుకని రేవంత్ రెడ్డిని నిలదీశారు. మీ 11 నెలల పాలనే కాదు, మీ పాదయాత్ర కూడా నిర్బంధాల మధ్య కొనసాగుతుండడం దురదృష్టకరమంటూ విమర్శించారు. అరెస్టులు, అక్రమ నిర్బంధాలు చేసిన బీఆర్ఎస్ నాయకులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ముఖ్యమంత్రి మూసి పాదయాత్ర సందర్భంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అక్రమ అరెస్టులు, నిర్బంధాలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం
మాజీ ఎమ్మెల్యేలు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, చిరుమర్తి లింగయ్య, భూపాల్ రెడ్డి సహా ఇతర బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను హౌస్ అరెస్టులు చేసినంత మాత్రాన మీ… pic.twitter.com/3URbpa6yoS
— Harish Rao Thanneeru (@BRSHarish) November 8, 2024