హైదరాబాద్: నల్లగొండ జిల్లాలో బీఆర్ఎస్ నాయకుల అరెస్టుల పట్ల సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) ఫైరయ్యారు. రామన్నపేటలో నిర్మించ తలపెట్టిన అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీపై నిర్వహిస్తున్న ప్రజాభిప్రాయ సేకరణకు పార్టీ నేతలు వెళ్లకుండా అడ్డుకోవడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ నాయక్, భూపాల్ రెడ్డి, చిరుమర్తి లింగయ్య, గాదరి కిషోర్ సహా ఇతర నాయకులు, ప్రజాసంఘాల ప్రతినిధులను అరెస్టులు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.
స్వేచ్ఛగా జరగాల్సిన ప్రజాభిప్రాయసేకరణ, ఇంతటి నిర్బంధాల మధ్య చేయడం అప్రజాస్వామికమని చెప్పారు. ప్రజాపాలన అంటూ నిర్బంధాల పాలన కొనసాగించడం సిగ్గుచేటని విరుచుకుపడ్డారు. అక్రమంగా అరెస్టులు చేసిన బీఆర్ఎస్ నాయకులను, ప్రజా సంఘాల నేతలను, పర్యావరణవేత్తలను తక్షణం విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
రామన్నపేటలో నిర్మించ తలపెట్టిన అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీపై నిర్వహిస్తున్న ప్రజాభిప్రాయ సేకరణకు బీఆర్ఎస్ నేతలు వెళ్లకుండా అడ్డుకోవడం దుర్మార్గం.
నల్గొండ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ నాయక్, మాజీ ఎమ్మెల్యేలు భూపాల్ రెడ్డి, చిరుమర్తి లింగయ్య,… pic.twitter.com/VhynY7d1F8
— Harish Rao Thanneeru (@BRSHarish) October 23, 2024