Harish Rao | హన్మకొండ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, ఇతర నాయకులను నిర్భంధించడాన్ని మాజీ మంత్రి హరీశ్రావు తీవ్రంగా ఖండించారు. రైతు భరోసా పేరిట కాంగ్రెస్ చేసిన మోసంపై వరంగల్ పర్యటనలో ఉన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తే అడ్డుకోవడం దుర్మార్గమని మండిపడ్డారు.
రైతు భరోసా కింద ఎకరాకు రూ. 7,500 ఇస్తామని చెప్పి మాట తప్పిన మీ తీరును చూసి యావత్ తెలంగాణ రైతాంగం చీదరించుకుంటున్నదని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హరీశ్రావు విమర్శించారు. ఎక్కడ రైతులు తిరగబడతారో అని.. మంత్రుల పర్యటనల్లో భారీగా పోలీసులను మోహరించి ఎన్నాళ్ళు తప్పించుకుంటారని ప్రశ్నించారు. రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేసేదాకా మిమ్మల్ని ఎండగడుతూనే ఉంటామని.. ఎక్కడిక్కడ నిలదీస్తూనే ఉంటామని హెచ్చరించారు. పెద్ది సుదర్శన్ రెడ్డితో పాటు ఇతర బీఆర్ఎస్ నాయకులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
హన్మకొండ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గారిని, ఇతర నాయకులను నిర్భంధించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.
రైతు భరోసా పేరిట కాంగ్రెస్ చేసిన మోసం పై వరంగల్ పర్యటనలో ఉన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారిని కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చే ప్రయత్నం… pic.twitter.com/8SIqOtNRii
— Harish Rao Thanneeru (@BRSHarish) January 5, 2025