సిద్దిపేట, జూన్ 6(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యమే నారాయణరావుపేట గ్రామ రైతు కనకయ్యను బలి తీసుకొన్నదని బీఆర్ఎస్ డిఫ్యూటీ ఫ్లోర్ లీడర్, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు విమర్శించారు. వడ్ల కొనుగోలులో జరుగుతున్న అవకతవకల వల్లే ఆ రైతు గుండె ఆగిందని ఆవేదన వ్యక్తంచేశారు. గుండెపోటుతో మృతిచెందిన రైతు పల్లెవేని కనకయ్య (గద్దర్ ) మృతదేహానికి శనివారం హరీశ్రావు పూలమాల వేసి నివాళులర్పించారు. కనకయ్య మృతి తనను తీవ్రంగా కలిచి వేసిందని, ఆ కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చి, ఆర్థికసాయం అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కనకయ్య వడ్లను మారెట్ యార్డులో దాదాపు 45 రోజులపాటు ఎవరూ కొనకుండా ఆలస్యం చేశారని చెప్పారు.
చివరికి వర్షం పడి ఆ వడ్లన్నీ తడిసిపోయాయని, ఆ తడిసిన వడ్లను మిల్లుకు తీసుకెళ్లి ప్రాధేయపడితే, నాలుగు ట్రాక్టర్ల వడ్లకు ఏకంగా 40 సంచుల ధాన్యాన్ని మిల్లర్లు తరుగు తీశారని చెప్పారు. ‘నా 40 సంచుల వడ్లు కట్ చేసిండ్రు’ అని శుక్రవారం రాత్రి వరకు తోటి రైతులతో, కుటుంబ సభ్యులతో బాధపడుతూ, ఆ టెన్షన్లోనే నిద్రలోనే ఆయనకు గుండెపోటు వచ్చి మరణించాడని చెప్పారు. ఇది కచ్చితంగా ప్రభుత్వ హత్యే అని మండిపడ్డారు. హైదరాబాద్లో కూర్చొని 80 శాతం 90శాతం వడ్లు కొన్నామని ప్రభుత్వ పెద్దలు చెప్తున్నారని, కానీ క్షేత్రస్థాయిలో ప్రతి ఊర్లో ఇంకా 30 నుంచి 40 శాతం వడ్లు పెండింగ్లోనే ఉన్నాయని తెలిపారు. రైతుల ధాన్యంలో కోతలు పెడుతూ రైతుల ఉసురు పోసుకుంటున్నారని మండిపడ్డారు.
రేవంత్రెడ్డి ప్రభుత్వంలో పంట పండించడం ఒక ఎత్తయితే.. ఆ పంటను అమ్ముకోవాలంటే రైతులకు కండ్లలో నుంచి రక్తం వచ్చే పరిస్థితి కనిపిస్తున్నదని హరీశ్రావు ఆరోపించారు. కుకునూరుపల్లి వద్ద ఒక రాజస్థాన్ లారీలో వడ్లు ఎకించే ప్రయత్నం చేస్తే, ఆ లారీ వడ్లతో సహా రాజస్థాన్ వెళ్లిపోయిందని తెలిపారు. దుబ్బాక మండలం చేర్వాపూర్లో సంచులు ఎత్తకపోవడం వల్ల, ఎన్సాన్పల్లిలో కొనుగోలు చేయకపోవడం వల్ల వడ్లు మొత్తం మొలకలొస్తున్నాయని చెప్పారు. మంత్రి దామోదర రాజనర్సింహ నియోజకవర్గమైన అల్లాదుర్గం మండలం వెంకటాపూర్లో ఇప్పటివరకు ఒక క్వింటా వడ్లు కూడా కొనలేదని ఆరోపించారు.
రేవంత్రెడ్డి క్షేత్రస్థాయి సమస్యలు వదిలేసి.. నేను మళ్లీ గెలుస్తా, తొకుతా, పండబెడుతా అంటూ తొండల భాష, తొత్తిరి భాష మాట్లాడుతున్నారు తప్ప.. రైతులకు ఏమి చేశారో? చెప్పడం లేదని మండిపడ్డారు. రెండు నెలలకు పైగా కల్లాల్లో వడ్లు పోసుకొని ఎదురుచూస్తున్న రైతుల గోస కనపడటం లేదా? అని సూటిగా ప్రశ్నించారు. వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో, మాటలు కట్టిపెట్టి ఎలాంటి కోతలు లేకుండా యుద్ధప్రాతిపదికన వడ్లను తక్షణమే కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.