Harish Rao | హైదరాబాద్, ఫిబ్రవరి 17 (నమస్తే తెలంగాణ): శాసనసభలో సాధారణంగా అధికారపక్షానిది పైచేయిగా ఉంటుంది. ప్రతిపక్ష సభ్యుల నోళ్లు మూయించేందుకు అధికారపక్షం ప్రయత్నిస్తుంది.. ఇందుకోసం అవసరమైతే తమవాడైన స్పీకర్ను వాడుకుంటుంది. కానీ శనివారం శాసనసభలో ప్రతిపక్ష సభ్యునిది పైచేయి కాగా, అధికార పక్షం మొత్తం డిఫెన్స్లో పడినట్టు కనిపించింది.
కాళేశ్వరం నీటిపారుదల ప్రాజెక్టులపై ప్రభుత్వం ప్రవేశపెట్టిన శ్వేతపత్రంపై జరిగిన చర్చ సందర్భంగా బీఆర్ఎస్ సభ్యుడు, మాజీ మంత్రి హరీశ్రావు ఒక్కడే అధికార పక్షం మొ త్తానికి దీటుగా నిలవడం కనిపించింది. ముఖ్యమంత్రి సహా మంత్రులందరూ, అధికార పార్టీ సభ్యులు మాటల తూటాలు పేల్చినప్పటికీ సహనం కోల్పోకుండా హరీశ్రావు సమాధానం ఇవ్వటం నివ్వెరపరిచింది.
ఓ దశలో ఆయన ‘నేను శ్వేతపత్రంపై మా ట్లాడుతుంటే వెంకన్న లేచి ఎస్ఎల్బీసీపై అడుగుతున్నడు, కృష్ణారావు లేచి కేఆర్ఎంబీపై అడుగుతున్నరు, భట్టన్న లేచి రాజీవ్సాగర్పై, ఇలా నేను ఈ అన్నకు సమాధానం చెప్పాలా, ఆ అన్నకు చెప్పాలా? శ్వేతపత్రంపై మాట్లాడాలా.. ఏం చేయా లె? నాకు సమయం ఇవ్వండి ప్రతి ఒక్కరికి సమాధానం చెప్తా. రాత్రి 12 అయినా సరే ఒక్కొక్కరికి స మాధానం చెప్పే సత్తా నాకున్నది. టైం ఇవ్వండి.’ అన్నారంటే హరీశ్ను అడ్డుకొనేందుకు మంత్రులు ఏ స్థాయిలో ప్రయత్నించారో తెలిసిపోతుంది. ప్రాజెక్టులపై తనకున్న అపార అవగాహనతో హరీశ్రావు ఒక్కరే మాట్లాడుతుంటే.. ఆయనకు కౌంటర్లు ఇచ్చేందుకు సీఎంతో పాటు ఎనిమిది మంది మంత్రులు మాటల దాడికి దిగడం గమనార్హం. ఆయన ఒక్కొక్కటిగా వాస్తవాలను బయటపెడుతూ ఉంటే.. నిజాలు ఎక్కడ బయటకు వెళతాయోనన్న అసహనం మంత్రుల్లో కనిపించింది.
శ్వేతపత్రంలోని తప్పులను ఎత్తి చూపుతూ కాళేశ్వరంపై ప్రభుత్వం చేస్తు న్న అబద్ధాలను బట్టబయలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి నిర్మించిన ప్రాజెక్టులపై ఆయన గుక్కతిప్పుకోకుండా సమాధానం చెప్పారు. ప్రా జెక్టుల ఖర్చు, వాటి నిర్మాణ శైలి, ఆయకట్టు ఇలా ప్రతి అంశంపైనా హరీశ్ ఇచ్చిన వివరణ కొత్త సభ్యులను విస్మయపరిచింది. మాజీ మంత్రి హరీశ్రావు అధికారపక్షాన్ని చెడుగుడు అడుకున్నారం టూ సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి.
కెమెరాను మావైపూ తిప్పండి
‘ఆ కెమెరాను మా వైపు కూడా తిప్పం డి సర్’ అంటూ అసెంబ్లీలో హరీశ్రావు చేసిన వ్యాఖ్యలతో అప్పటి వరకు సీరియస్గా సాగిన సభలో ఒక్కసారిగా నవ్వులు పూశాయి. తాను మాట్లాడుతుంటే టీవీ ల్లో గొంతు వినిపిస్తుందట కానీ, తన ము ఖం కనిపించడం లేదని ఇంటి నుంచి తన పీఏకు ఫోన్ వస్తే ఆయన చిట్టీ తెచ్చి ఇచ్చారని స్పీకర్తో హరీశ్ చెప్పారు. తాను మాట్లాడుతుంటే.. స్పీకర్ను లేదంటే సభ ను చూపిస్తున్నారని, ఆ కెమెరాలో తమ ను చూపించాలని విజ్ఞప్తి చేశారు. ‘కెమెరాలోనూ తిప్పుడేనా సర్, ఇందులోనూ రివర్సేనా?’ అంటూ హరీశ్ చేసిన వ్యాఖ్యలతో సభ్యులు హాయిగా నవ్వుకున్నారు.
సభ్యులు కాని వారు సభలో ఎట్లుంటారు?
అసెంబ్లీలో శనివారం నీటిపారుదలశాఖపై శ్వేతపత్రం విడుదల సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు సభలో ఓ టెక్నీషియన్ ఉండటం పట్ల అభ్యంతరం వ్యక్తంచేశారు. సభ్యులు కానీ వారు సభలో ఎట్లుంటారు..? ఎలా అనుమతిస్తారని ప్రశ్నించారు. ఎవరిని పడితే వారిని సభలో కూర్చొబెడితే సభ గౌరవం దెబ్బతింటుందని స్పీకర్ దృష్టికి తీసుకొచ్చారు. గతంలో కేసీఆర్ సొంతంగా ప్రజంటేషన్ ఇచ్చారని.. టెక్నీషియన్ను తెచ్చుకోలేదని గుర్తుచేశారు. స్పీకర్ గడ్డంప్రసాద్ కుమార్ స్పందిస్తూ గతంలోని రికార్డులను పరిశీలించే సభలోకి టెక్నీషియన్ను అనుమతించామని, సభ్యులెవరూ స్పీకర్ను ప్రశ్నించవద్దని అనడంతో వివాదం సద్దుమణిగింది.