గజ్వేల్/మర్కూక్, ఏప్రిల్ 9: బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావుకు తెలుగు సంవత్సరాది ఉగాది పండుగ శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని నివాసానికి మం గళవారం మధ్యాహ్నం బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు పెద్దసంఖ్యలో తరలివచ్చా రు. గజ్వేల్, సిద్దిపేట, దుబ్బాక నియోజకవర్గాల నుం చి అధిక సంఖ్యలో పార్టీ శ్రేణులు పోటెత్తడంతో పరిసరాలు జనసంద్రంగా మారాయి. చాలామంది రావడంతో ఒక్కొక్కరిని సిబ్బంది లోపలికి అనుమతించారు.
వేలాదిగా వస్తూనే ఉండటంతో కేసీఆర్ స్వ యంగా బయటకు వచ్చి కార్యకర్తలకు, నేతలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. కేసీఆర్ను కలిసినవారిలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు, దుబ్బా క ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి, ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ అంజిరెడ్డి, మాజీ ఏఎంసీ చైర్మన్లు జహంగీర్, మాదాసు శ్రీనివాస్, రాష్ట్ర నాయకుడు జుబేర్ తదితరులు ఉన్నారు.
క్రోధినామ సంవత్సర ఉగాది శుభకాంక్షలు తెలిపేందుకు వేలాదిగా పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా రావడంతో ఒక్కొక్కరిని కలవడానికి ఎక్కువ సమయం పట్టి ఆలస్యమవుతున్న విషయం తెలుసుకొన్న కేసీఆర్ స్వయంగా బయటకు వచ్చారు. అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు చెప్పారు.
ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. ‘మీ అభిమానానికి ధన్యవాదాలు.. మనమందరం కలిసికట్టుగా పోరాడి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం. ఇక ముందు మన ప్రయాణం చాలా ఉన్నది’ అని పేర్కొన్నారు. ‘మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు.. శుభం కలగాలని భగవంతుడిని కోరుకుంటున్న.’ అని తెలిపారు. రా ష్ట్ర ప్రజలంతా బాగుండాలని భగవంతుడిని ఆకాక్షించినట్టు కేసీఆర్ పేర్కొన్నారు. జై తెలంగాణ నినాదాలతో కేసీఆర్ నివాసం మార్మోగింది. కార్యకర్తలకు పేరు పేరునా కేసీఆర్ ధన్యవాదాలు తెలిపారు.