హైదరాబాద్, జూన్ 27 (నమస్తే తెలంగాణ): బక్రీద్ పురస్కరించుకొని ముస్లిం సోదరులు స్వచ్ఛత, పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని హోంమంత్రి మహమూద్ అలీ సూచించారు. ఇండ్లతో పాటు పరిసరాలను క్లీన్గా ఉంచాలని మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. వ్యర్థాలను మున్సిపాలిటీలు ఏర్పాటు చేసిన స్థలంలో వేయాలని కోరారు. తెలంగాణ ప్రజలకు ముందస్తు బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.