హైదరాబాద్, జూన్ 22 (నమస్తే తెలంగాణ) : బడికొచ్చే చిన్నారులకు ప్రేమ, వాత్సల్యంతో పాఠా లు చెప్పేందుకు పాఠశాల విద్యాశాఖ సిద్ధమవుతున్నది. కృత్యాలు, కథలు, నృత్యాలు, ఆటపాటలు, బొమ్మలతో పిల్లలను చేరదీసేందుకు సమాయత్తమవుతున్నది. పిల్లల్లో ఉరిమే ఉత్సాహాన్ని నింప డం.. పరుగెత్తుకుంటూ పాఠశాలకు వచ్చేలా చేయ డం కోసం ప్రాథమిక పాఠశాలల్లో జాయ్ఫుల్ లెర్నింగ్ను అమలుచేయనున్నది.
‘హరివిలు’్ల పేరు తో హ్యాపీనెస్ కరిక్యులాన్ని ఈ విద్యాసంవత్సరం నుంచి అమలుచేస్తారు. వికారాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, మహబూబాబాద్, జోగుళాంబ గద్వాల, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో ఈ కార్యక్రమాన్ని జూలై 15 లేదా ఆగస్టు మొదటివారంలో ప్రారంభిస్తారు. దీనికి దాల్మియా సిమెంట్స్కు చెందిన విద్యావిభాగం బ్లూ ఆర్బ్ సంస్థ సహకారం అందించనున్నది.
ఏఐ, మెషీన్ లెర్నింగ్పై ప్రత్యేక శిక్షణ
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషీన్ లెర్నింగ్ అంశాలపై అక్టోబర్ 3నుంచి 18వరకు శిక్షణ ఇచ్చేందు కు ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ సన్నాహాలు చేస్తున్నది.