Karimnagar | కరీంనగర్లో చేపట్టిన హనుమాన్ ర్యాలీ ఉద్రిక్తతకు దారితీసింది. శోభాయాత్ర సమయంలో మద్యం మత్తులో ఓ వ్యక్తి వీరంగం సృష్టించాడు. వేరే మతానికి చెందిన వ్యక్తి అనుకుని అతన్ని హనుమాన్ భక్తులు అడ్డుకుని వాగ్వాదానికి దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకునే క్రమంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఆ వ్యక్తిని తమకు అప్పగించాలని హనుమాన్ భక్తులు పోలీసు వాహనాన్ని వెంబడించారు. ఈ క్రమంలో ఓ హనుమాన్ మాలధారుడు పోలీసు వాహనాన్ని పట్టుకుని వేలాడాడు. ఆ తర్వాత వాహనాన్ని ఆపిన పోలీసులు.. హనుమాన్ మాలధారులతో దురుసుగా ప్రవర్తించారు. దీంతో పోలీసుల అత్యుత్సాహంపై విమర్శలు వచ్చాయి. హనుమాన్ మాలధారులపై పోలీసుల వైఖరిని నిరసిస్తూ బీజేపీ కార్యకర్తలు ఆందోళనకు దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
కాగా, హనుమాన్ శోభాయాత్రలో కత్తి తిప్పిన వీరంగం సృష్టించిన వ్యక్తి బీజేపీ కార్యకర్తే అని తెలిసింది. అతన స్థానిక బీజేపీ నాయకుడు బాస సత్యనారాయణ అనుచరుడు జయదేవ్గా పోలీసులు గుర్తించారు. ఈ విషయం తెలుసుకోకుండా బీజేపీ శ్రేణులు వేరే వర్గానికి చెందిన వ్యక్తి అని.. హనుమాన్ భక్తులను ఉసిగొలిపి రాద్దాంతం చేసినట్లు సమాచారం.
కరీంనగర్లో పోలీసుల అత్యుత్సాహం!
హనుమాన్ మాలధారంలో ఉన్న వ్యక్తిని వందల అడుగులు లాక్కెళ్ళిన వైనం..
ఓ మతానికి చెందిన వ్యక్తితో శోభాయాత్ర విషయంలో గొడవ జరగడంతో హనుమాన్ మాలదారులను అరెస్టు చేసిన పోలీసులు..
నిరసనకు దిగిన హనుమాన్ మాలదారులకు మద్దతుగా వెళ్లిన బిజెపి నాయకులు.. పరిస్థితి… pic.twitter.com/fSTxgRpBVV
— Telugu Scribe (@TeluguScribe) May 25, 2024
కరీంనగర్లో హనుమాన్ దీక్ష స్వాములు శనివారం రాత్రి శోభాయాత్ర నిర్వహించారు. ఈ ర్యాలీ ప్రశాంత్నగర్ హనుమాన్ టెంపుల్ వద్దకు రాగానే మద్యం మత్తులో ఉన్న ఓ యువకుడు అందులోకి దూరాడు. కత్తితో డ్యాన్స్ చేస్తూ వీరంగం సృష్టించాడు. దీంతో ఆగ్రహించిన హనుమాన్ భక్తులు సదరు యువకుడి అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఆ యువకుడికి, హనుమాన్ భక్తులకు మధ్య మొదలైన వాగ్వాదం కాస్త ఘర్షణకు దారితీసింది.
వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని మద్యం మత్తులో ఉన్న యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. అతన్ని పోలీస్ వాహనంలో ఎక్కించుకుని పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లే ప్రయత్నం చేయగా, హనుమాన్ భక్తులు అడ్డగించేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఓ హనుమాన్ భక్తులు పోలీసు వాహనాన్ని గట్టిగా పట్టుకుని ఉండగా.. పోలీసులు వాహనాన్ని అలాగే స్పీడ్గా తీసుకెళ్లారు. ఓ హనుమాన్ భక్తుడు వాహనాన్ని పట్టుకుని అలాగే వేలాడుతూ ఉండిపోయాడు. వాహనం కొద్ది దూరం వెళ్లాక ఆపారు. ఆ తర్వాత వాహనాన్ని అడ్డుకున్న భక్తులను పోలీసులతో దురుసుగా ప్రవర్తించారు. ఈ క్రమంలో ఆందోళనకు దిగిన కొందరు భక్తులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
పోలీసుల తీరుపై హనుమాన్ భక్తులు ఆందోళనకు దిగారు. త్రీటౌన్ పోలీస్ స్టేషన్ ముట్టడికి యత్నించారు. వారికి బీజేపీ నేతలు మద్దతుగా వెళ్లారు. పోలీసులు వారిని చెదరగొట్టేందుకు లాఠీచార్జి చేయడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. అర్ధరాత్రి వరకు పరిస్థితి ఇలాగే కొనసాగింది. కాగా, హనుమాన్ శోభాయాత్రలో కత్తి తిప్పిన వ్యక్తిని జయదేవ్గా గుర్తించారు. అతను బీజేపీ నాయకుడు బాస సత్యనారాయణకు అనుచరుడు, బీజేపీ కార్యకర్త అని తెలిసింది. అయితే ఈ విషయం తెలుసుకోకుండా బీజేపీ శ్రేణులు వేరే వర్గానికి చెందిన వ్యక్తి అని హనుమాన్ భక్తులను ఉసిగొలిపి రాద్దాంతం చేశారని సమాచారం.
కరీంనగర్ వివాదంలో ట్విస్ట్!
నిన్న హనుమాన్ శోభాయాత్రలో కత్తి తిప్పిన వ్యక్తి బీజేపీ కార్యకర్తే!
నిన్న కరీంనగర్ హనుమాన్ శోభాయాత్రలో ఓ వ్యక్తి వెళ్లి కత్తి తిప్పగా వేరే మతానికి చెందిన వ్యక్తి అనుకోని దాడి చేసిన హనుమాన్ భక్తులు.
పోలీసుల అదుపులో ఉన్న జయదేవ్ స్థానిక బీజేపీ నాయకుడు… pic.twitter.com/CD9OVEIORq
— Telugu Scribe (@TeluguScribe) May 26, 2024