వారిలో నైపుణ్య పెంపునకు కృషి చేస్తాం
కేంద్ర చేనేత అడిషనల్ కమిషనర్ వివేక్
దుబ్బాక టౌన్, మార్చి 26: తెలంగాణలోని చేనేత కార్మికుల పనితీరు అద్భుతం అని కేంద్ర చేనేత శాఖ అడిషనల్ కమిషనర్ వివేక్కుమార్ బాజ్పేయ్ కొనియాడారు. వారిలోని నైపుణ్యాన్ని మరింత పెంచేందుకు పూర్తిస్థాయిలో సహకరిస్తామని హామీ ఇచ్చారు. సిద్దిపేట జిల్లా దుబ్బాకలోని దుబ్బాక చేనేత, హస్తకళల ఉత్పత్తి కేంద్రంలో సమర్థ్ పథకం కింద కార్మికులకు చేనేత రంగంలో సామర్థ్యం పెంపు కోసం జరిగే శిక్షణా తరగతులను శనివారం ఆయన ప్రారంభించారు. ఈ కేంద్రంలో తయారైన లినెన్ షర్ట్లు, చీరల నాణ్యతను పరిశీలించి కార్మికుల పనితీరును మెచ్చుకొన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని నూతన వస్ర్తాల ఆవిష్కరణకు దుబ్బాక వేదిక కావాలని ఆకాంక్షించారు. అనంతరం మాట్లాడుతూ.. తెలంగాణలో చేనే తరంగం వేగంగా అభివృద్ధి చెందడం సంతోషకరమన్నారు. కార్మికుల్లో నైపుణ్యం పెంచేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. అందులో భాగంగానే దుబ్బాకలో 25 మంది యువతకు సమర్థ్ పథకం కింద 45 రోజులు శిక్షణనిస్తున్నా మన్నారు. కార్మికులకు ముద్ర రుణాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని, పరికరాలు అందజేస్తామన్నారు. ఇప్పటికే 15 చేనేత సం ఘాలు, ప్రొడ్యూసర్ కంపెనీలతో చర్చించినట్టు చెప్పా రు. నివేదికలు రాగానే నైపుణ్యాల పెంపు, నూతన సాంకేతికత అందజేతను పరిశీలిస్తామన్నారు.