హైదరాబాద్ : గుజరాత్ ఎన్నికల సందర్భంగా ప్రధాని మోదీ దృష్టిని ఆకర్షించడానికి అఖిల భారత పద్మశాలి సంఘం చేనేత విభాగం వినూత్న పంథాను ఎంచుకుంది. చేనేతపై విధించిన జీఎస్టీ పన్నును తొలగించాలని గాంధేయ మార్గంలో తమ నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తుంది. చేనేతపై జీఎస్టీ పన్నును తొలగించాలని అనేక నిర్బంధాల మధ్య సూరత్ గాంధీ పార్కులో జీరో జీఎస్టీ ప్లకార్డులను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత పద్మశాలి సంఘం అధ్యక్షులు కందగట్ల స్వామి, ప్రధాన కార్యదర్శి గడ్డం జగన్నాథం, అఖిల భారత పద్మశాలి సంఘం చేనేత విభాగం అధ్యక్షుడు యర్రమాద వెంకన్న నేత, నటి, సామాజిక కార్యకర్త పూనమ్ కౌర్, చెలమళ్ళ సోమయ్య తదితరులు పాల్గొన్నారు.