మహబూబ్నగర్ టౌన్, జనవరి 2 : స్కూల్ గేమ్స్ ఫెడరేషన్(School Games Federation) ఆధ్వర్యంలో మహబూబ్నగర్ (Mahbubnagar) జిల్లా కేంద్రంలోని మహబూబ్నగర్ గ్రామర్ స్కూల్లో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి అండర్-17 బాల, బాలికల హ్యాండ్బాల్ టోర్నీ(Handball tournament) ముగిసింది. మంగళవారం జరిగిన ఫైనల్ మ్యాచ్లో బాలుర విభాగంలో ఆదిలాబాద్ జట్టు మహబూబ్నగర్ 20-17 గోల్స్ తేడాతో గెలిచి చాంపియన్గా నిలిచింది.
బాలికల విభాగంలో వరంగల్ జట్టు ఆదిలాబాద్పై 9-1 గోల్స్ తేడాతో గెలిచి విజేతగా నిలిచింది. బాలికల విభాగంలో మహబూబ్నగర్ జట్టు, బాలుర విభాగంలో వరంగల్ జట్టు మూడోస్థానంలో నిలిచాయి. విజేతలకు డీఈవో రవీందర్ ముఖ్యఅతిథిగా హాజరై విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు.