హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 5 (నమస్తే తెలంగాణ): తెలంగాణ హజ్ కమిటీ విజ్ఞప్తి మేరకు హజ్ యాత్రికుల కోసం బేగంపేట, సికింద్రాబాద్లో శనివారం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించామని హైదరాబాద్ రీజినల్ పాస్పోర్ట్ అధికారి దాసరి బాలయ్య ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇందులో 250 మంది హజ్ యాత్రికుల పాస్పోర్ట్ దరఖాస్తులను వెరిఫికేషన్ పూర్తి చేసినట్టు తెలిపారు. ఈ నెల 10 లోపు వారందరికీ పాస్పోర్టులు జారీ చేస్తామని వెల్లడించారు.