హైదరాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వం(Congress) కక్షపూరితంగా వ్యవహరిస్తున్నదని అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు(Guvvala Balaraju) ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ సైనికుడు హత్యకు గురైతే స్థానిక ఎమ్మెల్యేగా, మంత్రిగా ఆ కుటుంబాన్ని ఎందుకు పరామర్శించలేదని మంత్రి జూపల్లి కృష్ణారావు(Jupally Krishna rao)పై ఫైర్ అయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ కార్యకర్తలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, కాంగ్రెస్ దాహం ఒక హత్యతో తీరేలా కనిపించడం లేదని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ హత్యా రాజకీయాలకు తెర తీసిందని ఆరోపించారు. మంత్రిగా జూపల్లి హత్యా రాజకీయాలను నియంత్రించాలని అని మాత్రమే కేటీఆర్ అన్నారు తప్పా.. ఎలాంటి ఆరోపణలు చేయలేదు.
జూపల్లి ఎక్కడెక్కడో జరిగిన సంఘటనలను ప్రస్తావిస్తూ అనవసర ఆరోపణలు చేశారని మండిపడ్డారు. గతంలో కేసీఆర్ హయాంలో ఐదేళ్ల పాటు మంత్రిగా పనిచేసిన జూపల్లి లేనిపోని అంశాలను తెరపైకి తీసుకొస్తున్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని వెనకేసుకురావడం సబబు కాదని హితవు పలికారు.