యాదాద్రి: లక్ష్మీనరసింహస్వామి బ్రాహ్మణ నిత్యాన్నదాన సత్రం నూతన భవన నిర్మాణానికి శనివారం భూమి పూజ నిర్వహించారు. యాదగి రిగుట్ట పట్టణంలో నూతనంగా నిర్మించే భవన భూమి పూజలో ఎమ్మెల్సీ సురభి వాణిదేవి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.
కార్యక్రమంలో లక్ష్మీనరసింహస్వామి బ్రాహ్మణ నిత్యాన్నదాన ట్రస్టు చైర్మన్ గంటి సుమతిదేవి, డైరక్టర్లు గంటి లక్ష్మీసోమేశ్వర శర్మ, సభ్యులు శ్రావ్య, కులకర్ణి చంద్రశేఖర్, శామంత్, సోమయాదులు, ఉదయ సుందరి తదితరులు పాల్గొన్నారు.