హైదరాబాద్, డిసెంబర్18 (నమస్తే తెలంగాణ): ఎస్సీ గురుకులాల సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ జూనియర్ కాలేజీల్లో ప్రవేశాలకు జనవరి 15లోపు దరఖాస్తు చేసుకోవాలని గురుకులాల కార్యదర్శి నవీన్ నికోలస్ తెలిపారు. 2024-25 సంవత్సరానికి ఇంటర్ ఫస్టియర్ ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, ఎంఈసీ కోర్సుల్లో ప్రవేశాలుంటాయని వివరించారు.
ఈ ఏడాది పదోతరగతిలో పాసై, 17 ఏండ్లలోపు వయస్సు ఉన్న విద్యార్థులు www.tswreis.ac.in, http://www.tswreis.ac.in, https://tsswreisjc.cgg.gov.in వెబ్సైట్ల ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. రాత పరీక్ష ఫిబ్రవరి 4న ఉంటుందని, మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 38 సీవోఈల్లో బాలికలకు 2,000 సీట్లు, బాలురకు 1,680 సీట్లు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు.