జగిత్యాల రూరల్, మార్చి 16: కరీంనగర్ ఉమ్మడి జిల్లా రవాణా శాఖ కమిషనర్ మామిండ్ల చంద్రశేఖర్గౌడ్ ఎమ్మెల్యే సంజయ్కుమార్ను క్యాంప్ కార్యాలయంలో మంగళవారం మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. అంతకుముందు జగిత్యాల రవాణా శాఖ కార్యాలయాన్ని తనిఖీ చేసిన కమిషనర్, ఆవరణలో మొక్కలు నాటారు. ప్రజలకు సత్వర సేవలందించాలని ఈ సందర్భంగా కమిషనర్ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో డీటీవో శ్యాంనాయక్, ఎంవీఐ వంశీధర్, వెంకటరమణ, రంజిత్, ఏవో శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
జగిత్యాల పట్టణ మత్స్య పారిశ్రామిక సంఘం నూతన కార్యవర్గ సభ్యులు ఎమ్మెల్యేను క్యాంప్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాన్ని అందజేశారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గాన్ని ఎమ్మెల్యే సంజయ్కుమార్ అభినందించారు. కార్యక్రమంలో మత్స్య పారిశ్రామిక సంఘం అధ్యక్షుడు గుమ్ముల అంజయ్య, డైరెక్టర్లు రాజేశ్, అశోక్, నవీన్, నాయకులు జుంబర్తి శంకర్, ఆరుముల్ల గంగారెడ్డి, ఆరుముల్ల నర్సింహం, గుమ్ముల శంకరయ్య, ఆరుముల్ల నారాయణ, కట్లకుంట శంకర్, పల్లికొండ గంగాధర్ తదితరులు పొల్గొన్నారు.
జగిత్యాల రూరల్ మండలం జాబితాపూర్ గ్రామానికి చెందిన టీఆర్ఎస్ పార్టీ కార్యకర్త అరిగెల మహేశ్ తండ్రి కిషన్ అనారోగ్యంతో మంగళవారం మరణించాడు. ఎమ్మెల్యే బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ఆయన వెంట ఏఎంసీ చైర్మన్ కొలుగూరి దామోదర్రావు, సర్పంచ్ అంకం మమత- సతీశ్, ఎంపీటీసీ చిత్తారి స్వప్న – శ్రీనివాస్, నాయకులు కొత్తూరి తిరుపతి, స్వామిరెడ్డి, కుమార్, జగదీశ్, మల్లారెడ్డితోపాటు పలువురు పాల్గొన్నారు.