దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలో విజయవాడ డివిజనల్ రైల్వే ఆధ్వర్యంలో గూడూరు-మనుబోలు రైల్వేస్టేషన్ల మధ్య 2.2 కిలోమీటర్ల మేర నిర్మించిన అతి పొడవైన రైల్వేబ్రిడ్జిని శుక్రవారం ప్రారంభమైంది.
హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 25 (నమస్తే తెలంగాణ): దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలో విజయవాడ డివిజనల్ రైల్వే ఆధ్వర్యంలో గూడూరు-మనుబోలు రైల్వేస్టేషన్ల మధ్య 2.2 కిలోమీటర్ల మేర నిర్మించిన అతి పొడవైన రైల్వేబ్రిడ్జిని శుక్రవారం ప్రారంభమైంది.
ఈ వంతెన అందుబాటులోకి రావడంతో విజయవాడ-రేణిగుంట మధ్య రైళ్లు ఆటంకాలు లేకుండా సాఫీగా సాగిపోవడానికి అవకాశం ఏర్పడిందని రైల్వే అధికారులు తెలిపారు. వంతెన నిర్మించినందుకు రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ (ఆర్వీఎన్ఎల్) అధికారులను ఎస్సీఆర్ జనరల్ మేనేజర్ అరుణ్కుమార్ జైన్ అభినందించారు.