హైదరాబాద్/రాజన్న సిరిసిల్ల, సెప్టెంబర్ 19 (నమస్తే తెలంగాణ): తెలంగాణ మర మగ్గాలు, జౌళి అభివృద్ధి కార్పొరేషన్ (టీపీటీడీసీఎల్) చైర్మన్గా గూడూరి ప్రవీణ్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్లోని జౌళిశాఖ కార్యాలయంలో జరిగిన కార్యక్రమానికి చేనేత, జౌళిశాఖ మంత్రి కే తారకరామారావు, ఆర్అండ్బీశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, ప్రణాళికా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ హాజరయ్యారు.బాధ్యతలు స్వీకరించిన ప్రవీణ్కు మంత్రి కేటీఆర్ పుష్పగుచ్ఛం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్సీలు ఎల్ రమణ, బసవరాజు సారయ్య, మాజీ ఎమ్మెల్సీలు నారదాసు లక్ష్మణ్రావు, శ్రీనివాస్రెడ్డి, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కోరుకంటి చందర్, వరంగల్ మేయర్ గుండు సుధారాణి, తెలంగాణ రాష్ట్ర కోఆపరేటివ్ బ్యాంకు చైర్మన్ కొండూరి రవీందర్రావు, చేనేత అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ చింతా ప్రభాకర్, పోలీస్ హౌజింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్, రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండా శ్రీనివాస్, చేనేత, సిరిసిల్ల జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ, జౌళిశాఖ కార్యదర్శి బుద్ధప్రకాశ్ జ్యోతి తదితరులు హాజరై ప్రవీణ్ను అభినందించారు. ఈ సందర్భంగా ప్రవీణ్ను పద్మశాలీ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు, జూలపల్లి జడ్పీటీసీ సభ్యుడు బొద్దుల లక్ష్మణ్ సత్కరించారు.