సూర్యాపేట టౌన్, మే 14 : సూర్యాపేటలోని జనావాసాల్లో ఆదివారం గుడ్డెలుగు ప్రత్యక్షమైంది. డీ మార్ట్ వెనుక వైపు కొత్తగా నిర్మిస్తున్న ఓ ఇంట్లో మూలన నక్కింది. దీన్ని చూసిన యజమాని వెంటనే సంబంధిత అధికారులకు సమాచారమిచ్చాడు. అటవీ, పోలీస్, మున్సిపల్ అధికారులు, సిబ్బంది వచ్చి దాన్ని పట్టుకునేందుకు ప్రయత్నించారు.
జనం అరుపులను గమనించిన గుడ్డెలుగు ఒక్కసారిగా బయటకు రావడంతో పరుగులు తీశారు. అక్కడి నుంచి సమీపంలో నిర్మాణంలో ఉన్న మరో భవనంలోకి దూరింది. అధికారులు 6 గంటలు శ్రమించిన వలతో బంధించి మత్తు ఇంజక్షన్లు ఇచ్చి వరంగల్ జూకు పంపించారు. విషయం తెలుసుకున్న మంత్రి జగదీశ్రెడ్డి వెంటనే అక్కడికి చేరుకొని పరిస్థితిని ఎప్పటికప్పడు పర్యవేక్షించారు.