నియామక ప్రక్రియను ప్రకటించిన సర్కారు
గ్రూప్ -1 మార్కులు 900, గ్రూప్-2కు 600
మెయిన్స్కు 1:50 నిష్పత్తిలో అభ్యర్థుల ఎంపిక
జీవో 55 జారీ చేసిన సీఎస్ సోమేశ్కుమార్
గ్రూప్ -1
ప్రిలిమినరీ టెస్ట్: ఆబ్జెక్టివ్ టైప్లో 150 ప్రశ్నలకు పరీక్ష. రెండున్నర గంటల సమయం.
మెయిన్స్ రాత పరీక్ష: ఆరు పేపర్లు. ఒక్కో పేపర్కు 150 మార్కులు. సమయం 3 గంటలు
గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3, గ్రూప్-4, ఇతర క్యాటగిరీల పరీక్ష విధానం, సిలబస్ను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఎన్ని పేపర్లు ఉంటాయి? ఏ పేపర్కు ఎన్ని మార్కులు ఉంటాయి? పరీక్ష రాసేందుకు ఎంత సమయం కేటాయిస్తారు? తదితర వివరాలతో ప్రభుత్వం జీవో 55ని జారీ చేసింది. ఆ వివరాలు మీ కోసం సమగ్రంగా..
హైదరాబాద్, ఏప్రిల్ 25 (నమస్తే తెలంగాణ): గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3, గ్రూప్-4, ఇతర క్యాటగిరీల పోస్టుల భర్తీ ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. ఉద్యోగాల భర్తీ విధానంలో పలు మార్పులు చేయటమే కాకుండా, పోస్టుల విభజన, పరీక్ష విధానాన్ని ఖరారు చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ జీవో 55ను జారీచేశారు. గతంలో జారీచేసిన జీవో 11ను సవరించి, కొత్త జీవోను విడుదల చేశారు. గ్రూప్ -1లో 19 రకాల పోస్టులు, గ్రూప్-2లో 16 రకాల పోస్టులు ఉన్నాయి.
గ్రూప్ -3లో 8 రకాల పోస్టులు, గ్రూప్ -4లో జూనియర్ అసిస్టెంట్, జూనియర్ అకౌంటెంట్ పోస్టులు ఉన్నాయి. రాబోయే రోజుల్లో డైరెక్ట్ రిక్రూట్మెంట్ను జీవో 55కు అనుగుణంగా చేపట్టాలని టీఎస్ఎఎస్సీకి రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. గ్రూప్ -1 మెయిన్స్ను 900 మార్కులు, గ్రూప్-2ను 600 మార్కులకే నిర్వహించనున్నట్టు ప్రకటించింది. ఇంటర్వ్యూల రద్దుతో గ్రూప్ -1లో 100 మార్కులు, గ్రూప్ -2లో 75 మార్కులను తొలగించింది.
గ్రూప్ -1 పోస్టులు:
పరీక్షలు:
ప్రిలిమినరీ టెస్ట్:
పేపర్ -1
జనరల్ ఎస్సే
పేపర్ -2
హిస్టరీ, కల్చర్ అండ్ జాగ్రఫీ
వ్యవధి 3 గంటలు, మార్కులు 150
(పేపర్-2 టాపిక్స్)
పేపర్ -3
ఇండియన్ సొసైటీ, కాన్స్టిట్యూషన్ అండ్ గవర్నెన్స్
వ్యవధి 3 గంటలు, మార్కులు 150
(పేపర్-3 టాపిక్స్)
పేపర్ -4
ఎకానమీ అండ్ డెవలప్మెంట్
వ్యవధి 3 గంటలు, మార్కులు 150
(పేపర్-4 టాపిక్స్)
పేపర్ -5
సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ డాటా ఇంటర్ప్రిటేషన్
వ్యవధి 3 గంటలు, మార్కులు 150
(పేపర్-5 టాపిక్స్)
పేపర్ -6
తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఏర్పాటు
వ్యవధి 3 గంటలు, మార్కులు 150
(పేపర్-6 టాపిక్స్)
పరీక్ష విధానం
గ్రూప్-2
గ్రూప్-2కు సంబంధించి మొత్తం 600 మార్కులకు పరీక్ష ఉంటుంది. జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీ 150 మార్కులు, హిస్టరీ, పాలిటీ అండ్ సొసైటీ 150 మార్కులు, ఎకానమీ అండ్ డెవలప్మెంట్ 150 మార్కులు, తెలంగాణ ఉద్యమం మరియు రాష్ట్ర ఏర్పాటు 150 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. ఈ పరీక్ష ఇంగ్లిష్, తెలుగు, ఉర్దూలో ఉంటుంది.
ఉద్యోగం (విభాగం)
గ్రూప్ -3
గ్రూప్-3 పరీక్ష 450 మార్కులకు నిర్వహిస్తారు. పేపర్1లో జనరల్ స్టడీస్ అండ్ అబిలిటీస్ 150 మార్కులు, పేపర్ 2లో హిస్టరీ, పాలిటీ అండ్ సొసైటీ 150 మార్కులు, పేపర్ 3లో ఎకానమీ అండ్ డెవలప్మెంట్ 150 మార్కులకు నిర్వహిస్తారు. ప్రతి పరీక్ష రెండున్నర గంటల పాటు ఉంటుంది.
ఉద్యోగం (విభాగం)
గ్రూప్-4
వివిధ శాఖల్లోని జూనియర్ అసిస్టెంట్, జూనియర్ అకౌంటెంట్స్ పోస్టులు ఈ క్యాటగిరీలోకి వస్తాయి. పేపర్-1 జనరల్ స్టడీస్, పేపర్-2 సెక్రటేరియల్ ఎబిలిటీస్ ఉంటాయి. ఒక్కో పేపర్కు 150 మార్కులు ఉంటాయి. మొత్తం 300 మార్కులు. ఇంగ్లిష్, తెలుగు, ఉర్దూ భాషల్లో పరీక్ష నిర్వహిస్తారు. ఒక్కో పరీక్షకు రెండున్నర గంటల సమయాన్ని కేటాయిస్తారు.
పోస్టు : వివిధ శాఖల్లో సీనియర్ రిపోర్టర్స్ (ఇంగ్లిష్, తెలుగు, ఉర్దూ)
పరీక్ష విధానం – రాత పరీక్ష (కన్వెన్షనల్ టైప్)
1.సీనియర్ రిపోర్టర్ (ఇంగ్లిష్):
పేపర్: ఇంగ్లిష్ షార్ట్ హ్యాండ్
డిక్టేషన్ – నిమిషానికి 150 పదాలు,
సమయం: 7 నిమిషాలు, 150 మార్కులు
(ట్రాన్స్స్క్రిప్షన్ ఇన్ లాంగ్ హ్యాండ్ 90 నిమిషాలు )
2. సీనియర్ రిపోర్టర్ (తెలుగు):
పేపర్: తెలుగు షార్ట్ హ్యాండ్
డిక్టేషన్ నిమిషానికి 80 పదాలు,
సమయం: 7 నిమిషాలు, 150 మార్కులు
(ట్రాన్స్స్కిప్షన్ ఇన్ లాంగ్ హ్యాండ్ 90 నిమిషాలు )
3. సీనియర్ రిపోర్టర్ ( ఉర్దూ)
పేపర్: ఉర్దూ షార్ట్ హ్యాండ్
డిక్టేషన్ నిమిషానికి 130 పదాలు,
సమయం: 7 నిమిషాలు, 150 మార్కులు
(ట్రాన్స్స్కిప్షన్ ఇన్ లాంగ్ హ్యాండ్ 90 నిమిషాలు )
పోస్టు : ఇంగ్లిష్ రిపోర్టర్ లెజిస్లేచర్ సర్వీస్
పరీక్ష విధానం- రాత పరీక్ష (కన్వెన్షనల్ టైప్)
సీనియర్ రిపోర్టర్ ( ఇంగ్లిష్)
పేపర్: ఇంగ్లిష్ షార్ట్ హ్యాండ్
డిక్టేషన్- నిమిషానికి 180 పదాలు,
సమయం : 5 నిమిషాలు, 150 మార్కులు
(ట్రాన్స్స్క్రిప్షన్ ఇన్ లాంగ్ హ్యాండ్ 90 నిమిషాలు )
క్వాలిఫైయింగ్ మార్కులు: ఓసీ, ఈడబ్ల్యుఎస్, ఎక్స్సర్వీస్మెన్, మెరిటోరియస్ స్పోర్ట్స్ మెన్ 40 శాతం, బీసీలకు 35 శాతం ఎస్సీ, ఎస్టీ, వికలాంగులకు 30 శాతం మార్కులు రావాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థుల ఎంపికకు క్వాలిఫైయింగ్ మార్కులు రాకుంటే రాత పరీక్షలో వచ్చిన మార్కులను పరిగణనలోకి తీసుకొంటారు.