హైదరాబాద్, సెప్టెంబర్ 28 (నమస్తే తెలంగాణ): అభ్యర్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న గ్రూప్-2 తుది ఫలితాలు విడుదలయ్యాయి. టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం ఆదివారం ఈ ఫలితాలను విడుదల చేశారు. మొత్తం 783 పోస్టులకు 782 మంది అభ్యర్థులు ఉద్యోగాలను సాధించారు. మెడికల్ రిపోర్ట్ అందని కారణంగా ఒక పోస్టు భర్తీని విత్హెల్డ్లో ఉంచారు. గ్రూప్-2లో భాగంగా మొత్తం 18 రకాల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీచేశారు. పూర్తి వివరాల కోసం https://www.tspsc.gov.in వెబ్సైట్ను సంప్రదించాలని, పరీక్షలు నిర్వహించిన 10 నెలల్లోనే ఫలితాలు వెల్లడించామని కమిషన్ చైర్మన్ బుర్రా వెంకటేశం తెలిపారు. విజేతలకు దసరాలోపే నియామకపత్రాలను అందజేయాలని సర్కారు వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటికే గ్రూప్-1 విజేతలకు నియామక పత్రాలను అందజేయగా, గ్రూప్ -2 విజేతలకు సైతం అక్టోబర్ 2న దసరాలోపే శాఖల వారీగా నియామక ప త్రాలిచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
కేసీఆర్ హయాంలో
గ్రూప్-2 పోస్టుల భర్తీకి గత కేసీఆర్ సర్కారు హయాంలోనే నోటిఫికేషన్ విడుదలైంది. 2022లో 783 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయగా, అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు పరీక్షలు వాయిదా పడ్డాయి. 2024 డిసెంబర్లో రాత పరీక్షలను నిర్వహించారు. 2025 మార్చిలో జనరల్ ర్యాకింగ్ లిస్టును విడుదల చేశారు. మొత్తం 5,51,855 మంది గ్రూప్-2కు దరఖాస్తు చేయగా, 2,49,964 మంది అభ్యర్థులు పరీక్షలను రాశారు. వారి లో 13,316 మందిని అనర్హులుగా ప్రకటించారు. 2,36,649 మంది అభ్యర్థులతో జనరల్ ర్యాంకింగ్ లిస్టును విడుదల చేశారు. ఆ తర్వాత సర్టిఫికెట్ వెరిఫికేషన్ను నిర్వహించి, తాజాగా తుది ఫలితాలను విడుదల చేశారు.
పురుష టాపర్లు మహిళా టాపర్లు