హైదరాబాద్, మే 23 (నమస్తే తెలంగాణ): గ్రూప్-1 పోస్టుల దరఖాస్తులు రెండు లక్షలకు చేరువయ్యాయి. సోమవారం వరకు 1,90,253 మంది దరఖాస్తు చేసుకొన్నారు. మరో ఎనిమిది రోజులు (ఈ నెల 31 వరకు) మాత్రమే అవకాశం ఉండటంతో అభ్యర్థుల్లో ఆసక్తి పెరుగుతున్నది. టీఎస్పీఎస్సీలో ఓటీఆర్ చేసుకున్న అభ్యర్థులు మాత్రమే గ్రూప్-1 దరఖాస్తుకు అర్హులు. కొత్తగా 1,36,714 మంది ఓటీఆర్ చేసుకున్నారు. టీఎస్పీఎస్సీలో గతంలోనే 25,38,590 మంది అభ్యర్థులు ఓటీఆర్ చేసుకోగా.. ఇప్పటి వరకు 2,84,211 మంది మాత్రమే అప్డేట్ చేసుకొన్నారు. కొత్త జోనల్ వ్యవస్థ ప్రకారం 95 శాతం రిజర్వేషన్లు వర్తించాలంటే.. ఓటీఆర్ అప్డేట్ చేసుకోవాల్సిందే.