హైదరాబాద్, మార్చి 23 (నమస్తే తెలంగాణ): నెలవంక దర్శనంతో పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమైన సందర్భంగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు తెలంగాణతోపాటు దేశవ్యాప్తంగా ఉన్న ముస్లిం సమాజానికి శుభాకాంక్షలు తెలియజేశారు.
పరమ పవిత్రమైన రంజాన్ మాసం.. క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనను పెంపొందించి, ఆదర్శవంతమైన జీవితం దిశగా ప్రేరణ కల్పిస్తుందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.