హైదరాబాద్, జనవరి 29 (నమస్తే తెలంగాణ): ప్రకృతి, పర్యావరణం బాగుండాలని, మానవాళికి స్వచ్ఛమైన ప్రాణవాయువు అందాలనే సత్సంకల్పంతో రాజ్యసభ సభ్యు డు సంతోష్కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ కొత్త శిఖరాలను చేరుకుంటున్నది. తాజాగా అంటార్కిటికాలో ఎత్తయిన పర్వతంపైనా గ్రీన్ ఇండియా చాలెంజ్ పతాకం ఎగిరింది. ఎవరెస్ట్ సహా ఏడు ఖండాల్లోని ఏడు అత్యున్నత శిఖరాలను అధిరోహించే సవాల్ను స్వీకరించిన భూపతిరాజు అన్మిశ్వర్మ విజయవంతంగా పూర్తిచేశారు. భూగోళం చిట్టచివరలో, మంచు ఖండమైన అంటార్కిటికాలో ఎత్తయిన మౌంట్ విన్షస్ను చివరిసారిగా అధిరోహించి అక్కడ గ్రీన్ ఇండి యా చాలెంజ్ జెండాను ప్రదర్శించాడు. ఈ ఆశయాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లి.. అందరిలో పర్యావరణ సృహ కల్పించాలనే లక్ష్యంతో ఎత్తయిన పర్వతాలపై తాను ఈ పతాకాన్ని ప్రదరిస్తున్నట్టు అన్మిశ్వర్మ వెల్లడించారు. భూగోళం దక్షిణ ధృవంలో గ్రీన్ ఇండి యా చాలెంజ్ను ప్రదర్శించడం గర్వంగా ఉన్నదని, ఈ అవకాశం కల్పించిన ఎంపీ సంతోష్కుమార్కు కృతజ్ఞతలు తెలిపారు.