హైదరాబాద్ : తన పుట్టినరోజును పురస్కరించుకొని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగంగా మొక్కలు నాటారు. గ్రీన్ ఇండియా రూపకర్త ఎంపీ సంతోష్ కుమార్ ట్విట్టర్ వేదికగా మంత్రికి జన్మది శుభాకాంక్షలు తెలిపారు. సీఎం కేసీఆర్ హరిత తెలంగాణ స్వప్నం సాకారం కోసం గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటాలని కోరారు.
సంతోష్ కుమార్ పిలుపు మేరకు తన నివాసంలో కోడళ్లు సోనమ్ రాథోడ్, బిందు రాథోడ్, మనుమరాళ్లు కియరా రాథోడ్, ఆధ్యా రాథోడ్, కుటుంబ సభ్యులతో కలిసి మంత్రి జమ్మి, మామిడి మొక్కను నాటారు. గ్రీన్ ఇండియా చాలెంజ్లో పాల్గొని మొక్కలు నాటడం సంతోషంగా ఉందని మంత్రి సత్యవతి తెలిపారు.