హైదరాబాద్, జూలై 31 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో ఐదు ప్రైవేట్ యూనివర్సిటీల ఏర్పాటుకు రాష్ట్ర క్యాబినెట్ మరోసారి ఆమోదం తెలిపింది. వాస్తవానికి నిరుడు సెప్టెంబర్ 13నే ఈ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ప్రభు త్వం.. ఉభయ సభల ఆమోదం తర్వా త గవర్నర్ ఆమోదానికి పంపింది. నాటి నుంచి ఈ బిల్లు గవర్నర్ వద్ద పెండింగ్లోనే ఉంది.
ఇటీవల ఆ బిల్లును ఆమోదించకుండానే వెనక్కి పంపారు. సోమవారం జరిగిన సమావేశంలో రాష్ట్ర మంత్రి మండలి మళ్లీ ఆ బిల్లును ఆమోదించింది. దీన్ని ఈ నెల 3 నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో మరోసారి ఆమోదించి గవర్నర్కు పం పుతారు. రాజ్యాంగ ప్రక్రియ ప్రకారం ఒకసారి తిరస్కరించిన బిల్లును ప్రభు త్వం రెండోసారి గవర్నర్కు పంపిస్తే త ప్పకుండా ఆమోదించాల్సి ఉంటుంది.