కాచిగూడ, ఫిబ్రవరి 20: సీఎం కేసీఆర్ నిరుద్యోగుల పక్షాన నిలబడి వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీచేయడం చరిత్రాత్మకమని రాజ్యసభ సభ్యుడు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య కొనియాడారు. ప్రభుత్వ, గురుకుల పాఠశాలల్లో పోస్టులను భర్తీ చేయాలని కోరుతూ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణతో కలిసి సోమవారం సీఎస్ శాంతికుమారికి వినతిపత్రం అందజేశారు.
పాఠశాలల సమస్యల పరిష్కారానికి సీఎంతో మాట్లాడి చర్యలు తీసుకుంటామని సీఎస్ హామీ ఇచ్చినట్టు కృష్ణయ్య మీడియాకు చెప్పారు. మన ఊరు-మన బడితో నాణ్యమైన విద్య అందుబాటులోకి వస్తుందని తెలిపారు. కార్యక్రమంలో ఎర్ర సత్యం, భూపేశ్సాగర్, సుధాకర్, గుజ్జ సత్యం, మన్నారం నాగరాజు, వీరస్వామి, నరసింహగౌడ్, నిఖిల్ పాల్గొన్నారు.