హైదరాబాద్ : గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర మంత్రులు , ఎమ్మెల్యేలు పలు జిల్లాలో జాతీయ జెండాలను ఆవిష్కరించారు. కరీంనగర్ జిల్లా తీగలగుట్టపల్లి లోని తెలంగాణ భవన్లో బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ జెండాను ఎగురవేసి జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. నగర మేయర్ యాదగిరి సునీల్ రావు, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ కనుమళ్ల విజయ గారు, చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవి శంకర్, బీఆర్ఎస్ నగర అధ్యక్షులు చల్లా హరి శంకర్ గారు, సుడా చైర్మన్ జివి కృష్ణారావు గారు, గ్రంథాలయ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్ గారు, మార్కెట్ కమిటీ చైర్మన్ రెడ్డవేని మధు గారు, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మన్ రావు, అరేపల్లి మోహన్ , కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.
మినిస్టర్ క్వార్టర్స్లో..
గణతంత్ర దినోత్సవ సందర్భంగా హైదరాబాద్ లోని మినిస్టర్ క్వార్టర్స్ లోని తమ కార్యాలయంలో గురువారం రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కార్యాలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
రామగుండంలో..
రామగుండం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే కోరుకంటి చందర్ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను వివరించారు.
పెద్దపల్లిలో.,
పెద్దపల్లి ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి జాతీయ జెండాను ఎగురవేశారు. మహాత్ముల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఎంపీడీవో ఎం.రాజు, ఎంపీపీ బండారి స్రవంతి శ్రీనివాస్ గౌడ్ , అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.