CM KCR | నమస్తే తెలంగాణ నెట్వర్క్, ఫిబ్రవరి 17: జనహృదయ నేత, బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు జన్మదినోత్సవ సంబరాలు అంబరాన్నంటాయి. దేశ, విదేశాల్లో ఉన్న కేసీఆర్ అభిమానులు, బీఆర్ఎస్ శ్రేణులు ప్రియతమ నేత పుట్టినరోజు వేడుకలను శుక్రవారం ఘనంగా జరు పుకొన్నారు. హైదరాబాద్లోని పీవీమార్గ్ థ్రిల్ సిటీలో మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, హోంమంత్రి మహమూద్ అలీ హాజరై కేక్ కట్ చేశారు. మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్, మంత్రు లు గంగుల కమలాకర్, సత్యవతి రాథోడ్, బీఆర్ఎస్ పార్లమెంటరీ నేత కే కేశవరావు, ఎమ్మెల్సీలు ప్రభాకర్రావు, యెగ్గె మల్లేశం, సురభి వాణీదేవి తదితరులు పాల్గొన్నారు. వనపర్తి జిల్లా ఖిల్లాఘణపూర్ మండలం షాపూర్ ఎంజీకేఎల్ బ్రాంచ్ కెనాల్ వద్ద మంత్రి నిరంజన్రెడ్డి కేక్ కట్చేశారు.
మహబూబ్నగర్లోని అనాథశ్రమంలో మంత్రి శ్రీనివాస్గౌడ్ అనాథ పిల్లలతో కలిసి కేక్ కట్ చేశారు. మంత్రి జగదీశ్రెడ్డి ఆధ్వర్యంలో నల్లగొండలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశా రు. సుమారు 700 మంది రక్తదానం చేశారు. జనగామలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు కేక్ కట్చేశారు. హైదరాబాద్ వెంగళరావునగర్ శిశువిహార్లో మంత్రి సత్యవతి రాథోడ్ కేక్కట్ చేశారు. మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆధ్వర్యంలో ధర్మపురిలో 69 మహాగని మొకలు నాటారు. మంత్రులు సబిత, సత్యవతి ఆధ్వర్యంలో మహేశ్వరం గడికోటలో కేక్ కట్ చేశా రు. మంచిర్యాల జిల్లా చెన్నూరులో విప్ బాల్క సుమన్ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో మహారాష్ట్ర సిరోంచకు చెందిన కేసీఆర్ అభిమానులు చందు బత్తులవార్, రాజు గంధంవార్ రక్తదానం చేశారు. బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ ఆధ్వర్యంలో నందగిరిహిల్స్లో రక్తదాన శిబిరం నిర్వహించారు. విద్యుత్తుసౌదలో రక్తదాన శిబిరంలో ట్రాన్స్కో, జెన్కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్రావు, విద్యుత్తుశాఖ స్పెషల్ సీఎస్ సునీల్శర్మ తదితరులు పాల్గొన్నారు. పీఆర్టీయూ టీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పింగిలి శ్రీపాల్రెడ్డి ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా కడ్తాల్లోని జడ్పీహెచ్ఎస్ పాఠశాల ఆవరణలో మొక్కను నాటి, నీరు పోశారు.
మొక్కలు నాటిన ఎంపీ సంతోష్కుమార్
సీఎం వ్యవసాయ క్షేత్రంలో గ్రీన్ఇండియా చాలెంజ్లో భాగంగా ఎంపీ సంతోష్కుమార్తో కలిసి మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి, ఎమ్మెల్యే జీవన్రెడ్డి తదితరులు మొక్క లు నాటారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కీసరలో ఎంపీ సంతోష్తో కలిసి మంత్రి మల్లారెడ్డి మొక్కలు నాటారు.
ఇతర రాష్ర్టాల కార్మికుల రక్తదానం
సిద్దిపేట జిల్లా చేర్యాలలో ఛత్తీస్గఢ్కు చెందిన నరోత్తం బంజరు, శత్రువన్ బంజర్ అనే ఇద్దరు కార్మికులు రక్తదానంచేశారు. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం గంధంపల్లి, కొత్తపేటలో ఇటుక బట్టీల్లో పని చేస్తున్న ఒడిశాకు చెందిన కూలీలు కేక్ కట్ చేశారు.
గిఫ్ట్ ఏ స్మైల్తో చేయూత
గిఫ్ట్ ఏ స్మైల్ కింద పలువురు పేదలకు చేయూత అందించారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని 12వ డివిజన్కు చెందిన ఓ నిరుపేద కుటుంబానికి రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆటోను, కళ్యాణ్నగర్లో గొర్రెల, మేకల సహకార సంఘానికి వాటర్ కూలర్ను అందజేశారు. రంగారెడ్డి జిల్లా షాబాద్ జడ్పీటీసీ పట్నం అవినాశ్రెడ్డి.. దివ్యాంగులకు రూ.4 లక్షల విలువ చేసే 4 టై స్కూటీలను పంపిణీ చేశారు. పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ గుప్తా సాయంతో 400 మంది పారిశుద్ధ్య కార్మికులకు చీరలు పంపిణీ చేశారు.
విదేశాల్లో కేసీఆర్ జన్మదిన వేడుకలు
విదేశాల్లో కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘ నంగా జరుపుకొన్నారు. ఇంగ్లండ్, కువైట్, ఆస్ట్రేలియా సహ పలు దేశాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. అమెరికాలో స్థిరపడ్డ సంతోశ్ రాకొండ్ల స్కైడ్రైవ్ చేస్తూ కేసీఆర్కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.
శుభాకాంక్షలతో మార్మోగిన సోషల్ మీడియా
సీఎం కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా అభిమానుల శుభాకాంక్షలతో సోషల్ మీడియా మార్మోగింది. హ్యాపీ బర్త్డే కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ పేర్లతో హ్యాష్ట్యాగ్లు హోరెత్తాయి. సీఎం కేసీఆర్పై చాట్ జీపీటీ రాసిన వ్యాసం సోషల్ మీడియలో ట్రెండింగ్గా మారింది.
సీఎం కేసీఆర్కు రాష్ట్రపతి, ప్రధాని శుభాకాంక్షలు
సీఎం కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. ఆయనకు ఫోన్లో శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని మోదీ, గవర్నర్ తమిళిసై, మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సహా కేంద్ర మంత్రు లు నితిన్గడరీ, రాజ్నాథ్సింగ్, రావు సాహెబ్పాటిల్ దన్వే, శ్రీపాద్ యశోనాయ క్, హర్యానా గవర్నర్ దత్తాత్రేయ, ముఖ్య మంత్రులు అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్, పినరాయి విజయన్, స్టాలిన్, జగన్మోహన్రెడ్డి, హిమంత బిశ్వశర్మ, మాజీ ప్రధాని దేవెగౌడ, సినీనటుడు చిరంజీవి, మాజీ సీఎంలు కుమారస్వామి, అఖిలేశ్యాదవ్, చంద్రబాబునాయుడు, హైద్రాబాద్లో బ్రిటిష్ డిప్యుటీ హై కమిషనర్ గారెత్ విన్ ఓవెన్, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్, సినీ హీరో మహేశ్బాబు, జనతా కాంగ్రెస్ ఛత్తీస్గఢ్ ప్రెసిడెంట్ అమిత్ జోగి, లోక్మత్ మీడియా సంస్థ చైర్మన్ విజయ్ దర్దా తదితరులు ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు
హిమాన్షు గోల్డెన్ అవర్ సాంగ్ సూపర్
తాతకు తగ్గ మనుమడిగా, తండ్రి తగ్గ తనయుడిగా మరోసారి ప్రతిభను నిరూపించుకొన్నారు కల్వకుంట్ల హిమాన్షు. తన తాతయ్య, సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా అమెరికా గాయకుడు జాకబ్ లాసన్ పాడిన గోల్డెన్ అవర్ సాంగ్ను పాడి, యూట్యూబ్లో అప్లోడ్ చేశారు. ఈ ఇంగ్లిష్ సాంగ్ ఆలాపనలో హిమాన్షు ఆంగ్ల యాసను ఉచ్ఛరించిన తీరు సైతం ఆకట్టుకుంటుంది. హిమాన్షు పాడిన పాటపై నెటిజన్లు ప్రశంశలు కురిపిస్తున్నారు. ‘సాంగ్ ఆమోఘం, గొంతు బాగున్నది.. మొదటి పాటతోనే అదరగొట్టారు.. నాయకుడి కడుపులో కళాపుత్రుడు’ అంటూ స్పందించారు.
2.40 నిమిషాల నిడివి గల ఈ పాటను డీఎస్ఎన్ ఫిల్మ్స్ దూలం సత్యనారాయణ బృందం చిత్రీకరించింది. హిమాన్షు పాడిన పాట సోషల్ మీడియాలో వైరల్గా మారింది. తన కొడుకు పాడిన పాట పట్ల చాలా గర్వంగా, సంతోషంగా ఉన్నదని మంత్రి కేటీఆర్ ట్విట్టర్ ద్వారా సంతోషాన్ని వ్యక్తం చేశారు. ‘ఈ పాటను నేను చాలా ఇష్టపడుతున్నా, మీరు కూడా ఇష్టపడుతారని ఆశిస్తున్నా’ అంటూ ట్వీట్ చేశారు. తండ్రి ట్వీట్కు హిమాన్షు ‘థ్యాంక్యూ డాడీ’ అని రిపె్లై ఇచ్చారు. హిమాన్షు పాడిన పాట గర్వంగా ఉన్నదని మేనత్త, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. పాటను అద్భుతంగా, బాగా పాడావంటూ ట్విట్టర్ ద్వారా అభినందించారు. దేవుడి ఆశీర్వాదం ఉండాలంటూ ఆకాంక్షించారు.
తాతకు ప్రేమతో..
తాతయ్య కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఆయనతో తన అనుబంధాన్ని హిమాన్షు ట్విట్టర్ వేదికగా పంచుకొన్నారు. ‘అత్యంత ప్రియమిత్రుడు, స్ఫూర్తిప్రదాత, తాతయ్య కేసీఆర్ 69 ఏండ్ల క్రితం ఈ రోజు జన్మించారు’ అని పేర్కొన్నారు. ‘సామాజిక, నైతిక విలువలను నేర్పించిన తాతకు ధన్యవాదాలు’ అని తెలిపారు. ఎవరినీ వివక్షతో చూడకుండా, అందరినీ సమానంగా చూడగలిగేలా తనను తాతయ్య తయారు చేశారని వివరించారు. సమాజం పట్ల తనలో సేవాదృక్పథాన్ని నింపిన ఆయనకు థాంక్యూ చెప్పారు.