హైదరాబాద్, మే 9 (నమస్తే తెలంగాణ): గ్రామ పంచాయతీ కార్యదర్శులు విధుల్లో చేరారు. మంగళవారం సాయంత్రం కల్లా విధుల్లో చేరాలని ప్రభుత్వం ఇచ్చిన అల్టిమేటంతో గ్రామ కార్యదర్శులు విధుల్లో చేరేందుకు అంగీకరించారు. రాష్ట్రవ్యాప్తంగా ఎంపీడీవో కార్యాలయాల్లో విధుల్లో చేరుతున్నట్టుగా లేఖలు ఇచ్చారు. సాయంత్రం డెయిలీ శానిటేషన్ రిపోర్ట్ (డీఎస్ఆర్) యాప్లో శానిటేషన్ నివేదికలను పొందుపర్చారు.
తాము సమ్మెలో పాల్గొనడం తొలితప్పుగా భావించి, క్షమించి విధుల్లోకి తీసుకోవాలని జూనియర్ పంచాయతీ కార్యదర్శులు (జేపీఎస్)లు ఎంపీడీవోలకు లేఖలు అందించారు. జేపీఎస్లను కొన్ని రాజకీయ పార్టీల నేతలు రాజకీయంగా ఉపయోగించుకొని ప్రభుత్వంపై బురదజల్లాలనే కుట్రలను ఛేదించి ప్రభుత్వం ఇచ్చిన పిలుపుతో విధుల్లో చేరారు. ముఖ్యమంత్రి కేసీఆర్పై, ప్రభుత్వంపై తమకు నమ్మకం ఉన్నదని, అందుకే తాము విధుల్లో చేరుతున్నామని జేపీఎస్లు తెలిపారు.