హైదరాబాద్, ఫిబ్రవరి 14 (నమస్తే తెలంగాణ) : నల్లగొండ నియోజకవర్గానికి చెందిన అర్హులైన పట్టభద్రులు మార్చి 14 వరకు గ్రాడ్యుయేట్ ఓటు నమోదుకు దరఖాస్తు చేసుకోవాలని కేంద్ర ఎన్నికల కమిషన్ తెలిపింది. ఈ నెల 6కే గడువు ముగిసినా.. కొత్త దరఖాస్తులను స్వీకరిస్తున్నట్టు సీఈవో వికాస్రాజ్ వెల్లడించారు.
ఏప్రిల్ 4న తుది ఓటర్ల జాబితాను ప్రకటిస్తామని తెలిపారు. నల్లగొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల పరిధిలోని అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి సాధారణ ఓటరై ఉండాలని, 2023 నవంబర్ 1 నాటికి డిగ్రీ పూర్తి చేసుకొని మూడేండ్లు ఉండాలని వివరించారు. ఫిబ్రవరి 6 నాటికి 4.60 లక్షల మంది అభ్యర్థులు ఓటుకు దరఖాస్తు చేసుకొన్నారని తెలిపారు.