హైదరాబాద్, మే 29 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో భాగంగా జూన్ 2న సాయం త్రం ట్యాంక్బండ్పై కార్నివాల్ ని ర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్నాయని ప్రభుత్వం తెలిపింది. ఈ సం దర్భంగా వివిధ సాంసృతిక కార్యక్రమాల నిర్వహణకు, బాణసంచా, లేజర్షో, ఫుడ్, గేమింగ్ స్టాళ్లను ఏర్పాటుచేస్తున్నారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన పలు సాంసృతిక కళా బృందాలతో ప్రదర్శనలు ఉంటా యి. సాంసృతిక కార్యక్రమాలకు ముఖ్యమంత్రి, మంత్రు లు, ఇతర ప్రముఖులు హాజరవుతా రు.
ప్రధాన వేదికపై వివిధ శాస్త్రీయ, జానపద, దకనీ సాంస్కృతిక ప్రదర్శనలు ఉంటాయి. తెలంగాణ రాష్ట్ర అధికారిక గీతమైన జయ జయహే తెలంగాణతో జాతీయ జెండాలతో మార్చ్ ఫాస్ట్ ఉండనున్నది. ట్యాంక్బండ్పై ఏర్పాటుచేసే దాదాపు 80 స్టాళ్లలో రాష్ట్రంలోని హస్తకళలు, స్వయం సహాయక బృందాలు త యారు చేసే వస్తువులు, చేనేత ఉత్పత్తులు, నగరంలోని పలు ప్రముఖ హోటళ్ల స్టాళ్లు, గేమింగ్ షోలు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు.