హైదరాబాద్, జనవరి 20 (నమస్తే తెలంగాణ): తెలంగాణ పర్యాటకశాఖకు కట్టాల్సిన లీజులు, రెవెన్యూ షేర్(ఏడీపీ) ఎగవేతదారులపై కఠినచర్యలు తీసుకోవాలని పర్యాటకశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అధికారులను ఆదేశించారు. లీజు అగ్రిమెంట్ నియమ, నిబంధనల ప్రకారం తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎగవేతదారులకు విద్యుత్తు, తాగునీటి సరఫరాను నిలిపివేసేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. గురువారం ఆయన హైదరాబాద్లోని తన కార్యాలయంలో ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యం(పీపీపీ)తో పర్యాటకశాఖ నిర్వహిస్తున్న ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించారు. ఉమ్మడిరాష్ట్రంలో అత్యంత విలువైన, వ్యూహాత్మక ప్రభుత్వ భూములను లీజుకు పొందిన కొన్ని సంస్థలు వార్షిక లీజు, రెవెన్యూ షేర్ చెల్లించకపోవడంతో ప్రభుత్వం కోట్లాది రూపాయలు నష్టపోతున్నదని వివరించారు. తక్షణమే వీటి వసూలుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో టూరిజం ఎండీ మనోహర్రావు, జాయింట్ సెక్రటరీ కరోల్ రమేశ్, శంకర్రెడ్డి, వోఎస్డీ సత్యనారాయణ లీగల్, ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు. ప్రభుత్వానికి ఏ సంస్థ ఎంత బకాయి ఉన్నదో మంత్రి వెల్లడించారు.