మహబూబ్నగర్లో ఏకలవ్య విగ్రహం
మంత్రి శ్రీనివాస్గౌడ్ హామీ
చిక్కడపల్లి, జూన్ 5: ఎరుకల అభివృద్ధి కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు అంశాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని రాష్ట్ర ఎక్సైజ్శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ హామీ ఇచ్చారు. మహబూబ్నగర్ పట్టణంలో ఏకలవ్య విగ్రహాన్ని ఆవిష్కరిస్తామని చెప్పారు. ఆదివారం హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞానకేంద్రంలో నిర్వహించిన తెలంగాణ ఎరుకల సంక్షేమ సంఘం ఆవిర్భావ దినోత్సవంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం కుల వృత్తులకు గతంలో ఏ ప్రభుత్వం ఇవ్వనంత ప్రాధాన్యం, ప్రోత్సాహం ఇస్తున్నదని పేర్కొన్నారు.
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి కులపిచ్చితో, కొన్ని పార్టీల వారు మత పిచ్చితో మాట్లాడుతూ రాష్ట్రంలో సుహృద్భావ వాతావారణాన్ని చెడగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. కార్యక్రమంలో బహుజన సాహిత్య అకాడమీ జాతీయ అధ్యక్షుడు నల్లా రాధాకృష్ణ, తెలంగాణ ఎరుకల సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు పొన్నకల్ ఎల్సరి కృష్ణయ్య, సంఘం గౌరవ అధ్యక్షుడు మాన్పాడ్ బాలయ్య, ప్రధాన కార్యదర్శి ముద్దని వెంకట్రాములు తదితరులు పాల్గొన్నారు.