హైదరాబాద్, నమస్తే తెలంగాణ : ఆకట్టుకునే బొమ్మలతో కూడిన అందమైన పాఠ్యపుస్తకాలను ప్రభుత్వం విద్యార్థులకు అందజేస్తున్నది. ఈ నెల నుంచే రెగ్యులర్ పాఠాలు బోధించాల్సి ఉండటంతో క్రమంగా విద్యార్థులకు చేర్చుతున్నది.
ఒకటో తరగతికి ఇంగ్లిష్ మీడియం, 2 – 8 తరగతుల వారికి తెలుగు, ఇంగ్లిష్ రెండుభాషల్లో ముద్రించిన పుస్తకాలను అందజేస్తున్నారు. 1వ తరగతి నుంచి 10 వ తరగతి వరకు విద్యార్థులకు ఈ విద్యాసంవత్సరం నుంచి క్యూఆర్ కోడ్ పుస్తకాలు అందుబాటులోకి వచ్చాయి. మొత్తంగా 1.40 కోట్ల పుస్తకాల్లో ఇప్పటి వరకు 60 శాతానికిపైగా పంపిణీ చేసినట్టు అధికారులు తెలిపారు.