TS Officers Transfers | తెలంగాణలో ఎన్నికల బదిలీలు కొనసాగుతున్నాయి. రెవెన్యూశాఖ, పంచాయతీరాజ్శాఖలకు చెందిన అధికారులను బదిలీ చేసిన విషయం తెలిసిందే. తాజాగా సోమవారం సైతం అబ్కారీశాఖతో పాటు పంచాయతీరాజ్ శాఖలకు చెందిన అధికారులను ప్రభుత్వం స్థానచలనం కల్పించింది. అబ్కారీశాఖలో పని చేస్తున్న 14 మంది ఎక్సైజ్ సూపరింటెండెంట్లతో పాటు ఇద్దరు డెప్యూటీ కమిషనర్లు, తొమ్మిది మంది అసిస్టెంట్ కమిషనర్లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
దాంతో పాటు మల్టీజోన్-1లో 64లో మంది, మల్టీజోన్-2లో 85 మంది ఎక్సైజ్ సీఐలకు బదిలీ అయ్యారు. పంచాయతీరాజ్ శాఖలో 105 మంది జడ్పీ సీఈవోలు, డిప్యూటీ సీఈవోలు, డీపీవోలకు ప్రభుత్వం స్థానచలనం కల్పించింది. 24 మంది డీఆర్డీవోలను సెర్ప్ సీఈవో బదిలీ చేశారు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో గత మూడేళ్లుగా ఒకే రెవెన్యూ జిల్లాల్లో పని చేస్తున్న అధికారులను బదిలీ చేయాలని కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశించింది. ఈసీ మార్గదర్శకాల మేరకు ప్రభుత్వం అధికారులను బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకున్నది. ఇప్పటికే తెలంగాణలో 395 మంది మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, 132 మంది తహసీల్దార్లు, 33 మంది నాయబ్ తహసీల్దార్లను ప్రభుత్వం బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.