తుర్కపల్లి: సీఎం కేసీఆర్ దత్తత గ్రామం వాసాలమర్రిలో శనివారం రెవెన్యూ అధికారులు ప్రభుత్వ భూముల సర్వే నిర్వ హించారు. ఈనెల 4న సీఎం కేసీఆర్ వాసాలమర్రిలో దళితులతో ఏర్పాటు చేసిన సమావేశంలో గ్రామంలోని ప్రభుత్వ భూములు, ఇతరుల కబ్జాలో ఉన్న భూములను వెలికి తీసి అట్టి భూములను దళితులకే కేటాయిస్తామని హామీ ఇచ్చారు.
అందులోభాగంగా ఆర్డీవో భూపాల్రెడ్డి సర్వే, ల్యాండ్ రికార్డు ఏడీ మధుసూదన్లు శుక్రవారం గ్రామాన్ని సందర్శించి సర్వే నం.22, 132, 133 ప్రభుత్వ, అసైండ్ భూములను సర్వే చేశారు. ఆయా సర్వే నంబర్లకు హద్దులను ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ఎంపీటీసీ పలుగుల నవీన్ కుమార్, తహసీల్దార్ జ్యోతి, రెవెన్యూ అధికారులు, సర్వేయర్లు పాల్గొన్నారు.