ఈ ఏడాది ఆగస్టు 5న పేట్లబుర్జు దవాఖానను సందర్శించినప్పుడు గమనించిన అంశమే.. ఈ రోజు రాష్ట్రవ్యాప్తంగా టిఫా స్కానింగ్ యంత్రాలను సమకూర్చుకోవడానికి దారితీసింది. దవాఖానలో సకల సౌకర్యాలు ఉన్నప్పటికీ, గర్భిణులు టిఫా స్కానింగ్ కోసం ప్రైవేటు కేంద్రాలకు వెళ్లాల్సి వస్తున్నదని గుర్తించాం. వెంటనే రాష్ట్రవ్యాప్తంగా ఆ సేవలనూ అందించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. దీంతో కేవలం రెండు నెలల్లోనే రూ.20కోట్లతో 56 టిఫా స్కానింగ్ యంత్రాలను దవాఖాన్లలో అందుబాటులోకి తెచ్చాం.
– వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు
ఏక కాలంలో ఈ నెల 15న ఎనిమిది మెడికల్ కాలేజీల ప్రారంభం. రూ.1,571 కోట్లతో నిమ్స్ విస్తరణకు పరిపాలనా అనుమతులు. రాజధానికి నలువైపులా టిమ్స్, వరంగల్లో సూపర్ స్పెషాలిటీ దవాఖాన నిర్మాణం వడివడిగా.. కంటివెలుగు రెండో విడతకు పచ్చజెండా. ఒకేసారి 44 ప్రభుత్వ దవాఖానల్లో ఏర్పాటుచేసిన 56 టిఫా సానింగ్ యంత్రాల ప్రారంభం.. తెలంగాణలో ఇది ఆరోగ్య విప్లవం. ప్రభుత్వ సంకల్పానికి సంకేతం. ఇప్పటికే గర్భిణుల నుంచి బాలింతల వరకు మహిళల ఆరోగ్యానికి ఎనలేని ప్రాధాన్యమిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. అత్యాధునిక సాంకేతిక సౌకర్యాలను అందుబాటులోకి తెస్తున్నది. గర్భస్థ శిశువుల్లో లోపాలను గుర్తించే 56 టిఫా యంత్రాలను శనివారం రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించి ప్రభుత్వ దవాఖానల స్థాయిని మరో మెట్టు పెంచింది.
హైదరాబాద్, నవంబర్ 26 (నమస్తే తెలంగాణ): కోటి ఎకరాల మాగాణంతో మరో హరిత విప్లవం. చేపల పెంపకంతో నీలి విప్లవం, మాంసం ఎగుమతులతో గులాబీ విప్లవం, పాడి పరిశ్రమకు చేయూతతో క్షీర విప్లవం సృష్టించి ఆర్థిక భరోసా కల్పించిన తెలంగాణ ప్రభుత్వం.. సకల సౌకర్యాలతో వైద్యాన్ని ప్రజల చెంతకు చేర్చి ఆరోగ్య విప్లవాన్ని సాధిస్తున్నది. అందులో భాగంగా పుట్టబోయే పిల్లలు గర్భంలో ఉన్నప్పుడు ఎలా ఉన్నారు? ఏమైనా లోపాలు ఉన్నాయా? అప్పటికప్పుడే సరిదిద్దవచ్చా? పుట్టాక చికిత్స చేయాలా? అనే అంశాలపై స్పష్టత ఇచ్చే టిఫా(టార్గెటెడ్ ఇమేజింగ్ ఫర్ ఫీటల్ అనామలీస్) స్కాన్ యంత్రాలను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది.
రాష్ట్రవ్యాప్తంగా 44 ప్రభుత్వ దవాఖానల్లో ఏర్పాటుచేసిన 56 టిఫా సానింగ్ యంత్రాలను శనివారం హైదరాబాద్లోని పేట్లబుర్జు దవాఖానలో హోం మంత్రి మహమూద్అలీతో కలిసి మంత్రి హరీశ్ వర్చువల్గా ప్రారంభించారు. ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ..గర్భిణులు టిఫా సానింగ్ కోసం ప్రైవేట్కు వెళ్తున్న పరిస్థితిని మార్చాలన్న సీఎం కేసీఆర్ ఆదేశాలతో రెండు నెలల్లోనే 44 ప్రభుత్వ దవాఖానాల్లో టిఫా సానింగ్ యంత్రాలను అందుబాటులోకి తెచ్చామని చెప్పారు. ఈ ఏడాది ఆగస్టు 5న పేట్లబుర్జు దవాఖానను సందర్శించినప్పుడు సకల సదుపాయాలు ఉన్నప్పటికీ, టిఫా సానింగ్కు ప్రైవేట్ కేంద్రాలకు వెళ్లాల్సి వస్తుందని గుర్తించామని.. వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటుచేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారని గుర్తుచేసుకొన్నారు. అప్పటి నుంచి రెండు నెలల్లోనే రూ.20 కోట్లతో 56 టిఫా యంత్రాలు అందుబాటులోకి తెచ్చామని చెప్పారు. దీనికి సహకరించిన అధికారులు సిబ్బందిని అభినందించారు. వీటి నిర్వహణకు ఇప్పటికే రేడియాలజిస్టులు, గైనకాలజిస్టులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చామని తెలిపారు.
కేసీఆర్ కిట్ పథకం ఇక్కడి నుంచే..
మాతా శిశు సంరక్షణలో విప్లవాత్మకమైన మార్పుకు శ్రీకారం చుట్టిన కేసీఆర్ కిట్ పథకాన్ని పేట్లబుర్జు నుంచే ప్రారంభించారని మంత్రి హరీశ్ గుర్తుచేశారు. పుట్టబోయే పిల్లల్లో లోపాలను గర్భంలో ఉండగానే గుర్తించేందుకు టిఫా స్కాన్ దోహదం చేస్తుందని చెప్పారు. గర్భంతో ఉన్నప్పుడు క్రమం తప్పకుండా ఏఎన్సీ చెకప్స్, అమ్మఒడి వాహనాల ద్వారా రవాణా సదుపాయం కల్పిస్తున్నామని తెలిపారు. ప్రసవం కోసం డెలివరీ రూంలు, ఎంసీహెచ్ కేంద్రాలు పటిష్టం చేశామని చెప్పారు. ప్రసవం తర్వాత కేసీఆర్ కిట్ అందించడంతోపాటు పిల్లలకు టీకాలు వేస్తున్నామని, పీఎన్సీ చెకప్స్ చేస్తున్నామని వెల్లడించారు. గర్భిణులు, బాలింతల సంరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం మూడంచెల సేవలను అందిస్తున్నదని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు పేరొన్నారు. ప్రభుత్వ దవాఖానల్లో ఇప్పటికే 155 అల్ట్రా సౌండ్ సానింగ్ యంత్రాలు ఉన్నాయని చెప్పారు. నెలకు సగటున 11 నుంచి 12 వేల పరీక్షలు జరుగుతున్నాయని తెలిపారు.
మూడంచెల వ్యూహం
తెలంగాణరాక ముందు ప్రసూతి సేవలు కొన్ని వైద్య కళాశాలలు, జిల్లా దవాఖానల్లో నే అందేవని హరీశ్రావు పేరొన్నారు. తెలంగాణ ప్రభుత్వం విసృ్తతంగా మాతా శిశు సంరక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయడంతోపాటు, గర్భిణులు టెస్టుల కోసం ప్రైవేటుకు వెళ్లాల్సిన అవసరం లేకుండా అన్ని పరీక్షలు ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిందన్నారు. ఇప్పటికే టీ డయాగ్నోస్టిక్ కేంద్రాల ద్వారా ఎనీమియా, థైరాయిడ్ సహా 57 రకాల పరీక్షలతో పాటు, రేడియాలజీ సేవలను ప్రారంభించిందని చెప్పారు. మాతా శిశు సంరక్షణ పట్ల మూడంచెల వ్యూహం అమలు చేస్తున్నామని చెప్పారు. ప్రసవానికి ముందు నాలుగు ఏఎన్ సీ చెకప్స్, అమ్మఒడి వాహన సౌకర్యం కల్పన, ఎంసీహెచ్ కేంద్రాలు, ఐసీయూ, ఎస్ఎన్సీయూలను బలోపేతం చేసి సుఖ ప్రసవానికి ఏర్పాట్లు చేశామని చెప్పారు.
ప్రసవం తర్వాత కేసిఆర్ కిట్, పీఎన్సీ చెకప్స్ చేసి టీకాలు వేయిస్తున్నట్టు తెలిపారు. ఆశ కార్యకర్తలు ఏఎన్ఎంలు గర్భిణుల ఆరోగ్యాన్ని పర్యవేక్షించడం, నాలుగు ఏఎన్ఎసీ చెకప్స్,102 వాహన సేవలు పొందేలా చూడటం, ప్రసవాల కోసం ప్రభుత్వ దవాఖానలకు తీసుకెళ్లడం, ప్రసవం తర్వాత ఇమ్యూనైజేషన్ను బాధ్యతగా చేస్తున్నారని అభినందించారు. ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాల పెరుగుదల, అనవసర సీ సెక్షన్ల తగ్గుదలలో నిరుటి నుంచి వైద్యసిబ్బంది కృషిని కొనియాడారు. కార్యక్రమంలో హెల్త్ సెక్రటరీ రిజ్వీ, కుటుంబ ఆరోగ్య సంక్షేమ విభాగం కమిషనర్ శ్వేతామహంతి, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ రమేశ్రెడ్డి, టీవీవీపీ కమిషనర్ అజయ్కుమార్, పేట్లబుర్జు దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ మాలతి, మెటర్నల్ హెల్త్ జేడీ డాక్టర్ పద్మజ, ఉస్మానియా మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ శశికళ తదితరులు పాల్గొన్నారు.
డబుల్ పాలనలో ట్రబుల్ ఎందుకు?
ఆరోగ్య రంగంలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తుంటే, ఇకడికి వచ్చే బీజేపీ నాయకులు ప్రచారం కోసం ఏదో ఒకటి మాట్లాడుతున్నారని మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. కేంద్రప్రభుత్వం విడుదల చేసిన నీతిఅయోగ్ ర్యాంకింగ్లో తెలంగాణ అగ్రస్థానంలో ఉంటే, ఉత్తర్ప్రదేశ్ ఆరోగ్య రంగంలో అన్ని రాష్ట్రాల కంటే చివరి స్థానంలో ఉన్నదని గుర్తుచేశారు. ఉత్తర్ప్రదేశ్లో డబుల్ ఇంజిన్ ఉన్నదని, అకడి ఆరోగ్య రంగం ఎందుకు ట్రబుల్లో ఉందో బీజేపీ నాయకులు చెప్పాలని డిమాండ్ చేశారు.
టిఫాతో ప్రయోజనాలు
హెల్తీ తెలంగాణ
నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు.. అనే పరిస్థితి నుంచి ప్రభుత్వ దవాఖానకే ప్రజలు వరుస కడుతున్న పరిస్థితి నేడు తెలంగాణలో కనిపిస్తున్నది. ఎనిమిదేండ్ల సీఎం కేసీఆర్ పాలనలో వైద్యరంగంలో మెరుగైన సౌకర్యాలు నెలకొల్పటమే దీనికి కారణం. ఆధునాతన సౌకర్యాలతో, నిపుణులైన వైద్యులతో ప్రజలకు కార్పొరేట్ సేవలు అందుతున్నాయి. వీటిలో కొన్ని ఇలా ఉన్నాయి.