Group-2 | హైదరాబాద్ : ఈ ఏడాది ఆగస్టు 29, 30 తేదీల్లో గ్రూప్-2 రాతపరీక్ష నిర్వహించేందుకు టీఎస్పీఎస్సీ ఏర్పాట్లు చేసింది. ఈ క్రమంలో గ్రూప్-2 పరీక్షా కేంద్రాలకు కేటాయించిన ప్రభుత్వ, ప్రయివేటు కాలేజీలు, స్కూళ్లకు సెలవులు ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. యధావిధిగా మిగతా ప్రభుత్వ, ప్రయివేటు స్కూల్స్, కాలేజీలు నడుస్తాయని స్పష్టం చేసింది. ఆగస్టు 29, 30 తేదీల్లో ఉదయం, మధ్యాహ్నం వేళల్లో గ్రూప్-2 ఎగ్జామ్ నిర్వహించనున్నారు.