రుణ మంజూరును ఆమోదించిన ఎన్సీడీసీ
ప్రిన్సిపల్ సెక్రటరీ, డైరక్టర్ చర్చలు సఫలం
రూ.4,563.75 కోట్ల రుణం
త్వరలోనే రెండో విడతకు డీడీల స్వీకరణ
హైదరాబాద్, జూన్17 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో గొర్రెల పంపణీ పథకానికి నేషనల్ కో ఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎన్సీడీసీ) నుంచి గ్రీన్ సిగ్నల్ లభించింది. శుక్రవారం ఢిల్లీలో జరిగిన సమావేశంలో పథకం అమలుకు అవసరమైన రుణ మంజూరుకు ఆమోదం తెలిపింది.
ఎన్సీడీసీ సమావేశం నేపథ్యంలో పశుసంవర్ధక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అధర్ సిన్హా, డైరక్టర్ రాంచందర్ ఢిల్లీకి వెళ్లి పథకం లక్ష్యాలు, అభివృద్ధి గురించి వివరించారు. అనంతరం పథకం అమలుకు అవసరమైన సుమారు రూ.4,563.75కోట్లను మంజూరు చేసేందుకు కార్పొరేషన్ అంగీకారం తెలిపింది.త్వరలోనే రెండో విడుత గొర్రెల పంపిణీకి డీడీలు సేకరించనున్నారు.