పునరుద్ధరణతో పాటు 324 పనులు పూర్తి
బలహీన వర్గాల కాలనీల్లో అధికం
హైదరాబాద్, మార్చి 16 : దేవాదాయశాఖ ఆధ్వర్యంలో ధార్మిక సంబంధ నిర్మాణాలు జోరుగా కొనసాగుతున్నాయి. ప్రధానంగా బలహీన వర్గాల కాలనీల్లో నూతన ఆలయాల నిర్మాణం, శిథిలావస్థలో ఉన్నవాటి మరమ్మతులు జరుగుతున్నాయి. కామన్ గుడ్ ఫండ్ కింద స్థానిక ఆలయ, ధార్మిక సంస్థ ల నిర్వాహకులు నామమాత్ర నిధులు సమకూర్చితే, మిగిలిన ఖర్చును దేవాదాయ శాఖ భరిస్తున్నది. బలహీ న వర్గాల కాలనీల్లో రూ.342.85 కోట్ల అంచనా వ్యయంతో 1,612 పనులు మంజూరు చేశారు. ఇందులో రూ.79.32 కోట్ల విలువైన 324 పనులు పూర్తి కాగా, 121.15 కోట్ల విలువైన 550 పనులు పురోగతిలో ఉన్నాయి. 142.38 కోట్ల ఖర్చుతో 738 పనులు చేపట్టాల్సి ఉన్నది. ఈ పథకం కింద ఆయా ధర్మకర్తలు, నిర్వాహకులు మొత్తం వ్యయంలో 5% చెల్లిస్తే, 95% దేవాదాయశాఖ మంజూరు చేస్తుంది.